రాజ్ (రవిబాబు), లీనా (నేహా చౌహాన్) భార్యాభర్తలు. వాళ్లకుదంపతులకు శ్రేయ, మున్ని అనే ఇద్దరు ఆడపిల్లలు. అయితేరాజ్ ఇద్దరుబిజినెస్మేన్. పిల్లలకీపిల్లలిద్దరికి ఆస్తమా ఉంటుంది. ఓ రోజు పిల్లలిద్దరూ స్విమ్మింగ్ చేస్తుంటారు. పెద్దమ్మాయి శ్రేయాచేస్తుండగా ఉన్నట్టుండిశ్రేయకు ఊపిరాడక స్మిమ్మింగ్ పూల్లోనే చనిపోతుంది. రాజ్ నిర్లక్ష్యమే ఆ పాప చావుకు కారణమవుతుంది. రాజ్ పెద్ద బిజినెస్మేన్. జపాన్ కంపెనీతో ఒప్పందం కోసం ప్రయత్నిస్తుంటాడు. శ్రేయాశ్రేయ చనిపోవడంతో లీనా ఆ ఇంట్లో ఉండలేకపోవడంతో వేరే ఇంటికి మారుతారు. కొత్త ఇంటికి వెళ్లాక చిన్న కూతురు మున్ని వింతగా ప్రవర్తిస్తుంది. ఒక ఆత్మతో మున్ని మాట్లాడుతూ ఉంటుంది. రెండుమూడు సార్లు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఆస్తమా ఉన్న కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకోవడం కోసం లీనా తన ఇంటికి సెక్యురిటీ లాకర్స్ ఏర్పాటు చేస్తుంది. ఏ డోర్ తీసినా అలారం మోగేలా పోలీసుల సాయంతో సెట్ చేస్తుంది. అయితే ఒక రోజు మున్ని ఇంట్లో నుంచి మాయమైపోతోంది. అదే టైమ్లో రాజ్ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పని చేస్తున్న జాన్వీ(ప్రియా వడ్లమాని) కూడా కనిపించకుండా పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు అందుతుంది.
జాన్వీ మిస్సింగ్ కేసు రాజ్ స్నేహితుడైన పోలీసు అధికారి వినోద్(ముక్తా ఖాన్) విచారిస్తుంటాడు. ఆ కేసు విషయం గురించి రాజ్ను విచారిద్దామని అతని ఇంటికి వస్తే.. మున్ని కనిపించడం లేదన్న విషయం తెలిసి ఆ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తారు. అందులో వినోద్కు సంచలన విషయాలు తెలుస్తాయి. మున్నితో ఒక ఆత్మ ఉందనే విషయం తెలుస్తుంది. ఆత్మల గురించి తెలిసిన తన మిత్రుడు డాక్టర్ పవన్ శర్మ (భరణీ శంకర్)ను పిలిపిస్తాడు. అప్పటి వరకు మామూలుగా ఉంటే రాజ్ భార్య లీనాలోకి ఒక్కసారిగా ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఎవరిది? మున్నిని ఎవరు తీసుకెళ్లారు? జాన్వీని ఎవరు చంపారు? అనే ఆసక్తికర అంశాలు సినిమాలో చూడాల్సిందే.