బిరుదురాజు రామరాజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
ఐ.చిదానందం (చర్చ | రచనలు) →పరిచయ వ్యాసం: [ ఈ రోజు (ఏప్రిల్-16) జానపద సాహిత్య కర్మయోగి బి.రామరాజు గారి జయంతి సందర్భం గా వారిని స్మరిస్తూ చిరు వ్యాసం.........] * ఐ.చిదానందం * ------------------------------------------------------------------------------ కష్టపడే వాళ్లని సాధారణ మానవులుగా కష్ట పెట్టే వాళ్లని రాక్షసులుగా కష్టమెరుగని వాళ్లని దేవతలుగా సర్వ సంగపరిత్యాగులను యోగులుగా..... లెక్కించవచ్చ... ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 75:
{{colend}}
==పరిచయ వ్యాసం==
[ ఈ రోజు (ఏప్రిల్-16) జానపద సాహిత్య కర్మయోగి బి.రామరాజు గారి జయంతి సందర్భం గా వారిని స్మరిస్తూ చిరు వ్యాసం.........]
* ఐ.చిదానందం *
-------------------------------------------------------------------
కష్టపడే వాళ్లని సాధారణ మానవులుగా
కష్ట పెట్టే వాళ్లని రాక్షసులుగా
కష్టమెరుగని వాళ్లని దేవతలుగా
సర్వ సంగపరిత్యాగులను యోగులుగా.....
లెక్కించవచ్చు. అలాంటి యోగుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం. అన్వేషించడం అలాగే వారి చరిత్రలను గ్రంధస్తం చేయడం అనేది ఒక సత్కారమే అనీ చెప్పవచ్చు. అంతటి మహా పురుషుల జీవితాలను సంకలనం చేసిన ధన్యజీవి బిరుదురాజు రామరాజు గారు. బి.రామరాజు గారు వరంగల్ జిల్లా దేవనూరు గ్రామంలో 16-04-1925 లో జన్మించారు.
మనం మట్టి తీసుకుంటే మట్టి పాత్ర తయారువుతుంది. వెండి తీసుకుంటే వెండిగిన్నె బంగారం తీసుకుంటే బంగారు పాత్ర తయారువుతుంది. అలా సాహిత్యం ను తీసుకుని జన హితం కై రచనలు చేసిన వ్యక్తి బి.రామరాజు గారు.
*వీరి రచనలు*
* తెలుగు జానపద గేయ సాహిత్యం (1956)
* త్రివేణీ (జానపద పాటల సంకలనం)
* పిల్లల పాటలు (1960)
* తెలంగాణ పల్లె పాటలు (1968)
* యక్షగాన వాజ్మయం (1968)
* మరుగు పడిన మాణిక్యాలు (1961)
* చరిత్రకెక్కని చరిత్రార్ధులు (1985)
* తెలుగు వీరుడు
* ఆంధ్ర యోగులు
* Flok tail of the andraprdesh
* Floklore of the andrapradesh (1974)
* Glimpes into telugu floklore (1991)
* south indian flok songs
* moharam flok songs
మనిషి బుద్ది జీవి . ఎప్పుడు నిత్యాన్వేషిగానే వుండాలి. ఇలాంటి సూత్రం నే ఆచరించిన రచయిత బి.రామరాజు అందుకే తెలుగు సాహిత్యం లో 60 దశకం లో వున్నపుడు అప్పటి వరకు తెలుగు సాహిత్యం లో స్పృశించని అంశం జానపదం పై పరిశోధనకు పూనుకున్నారు. అస్సలు జానపదంనే సాహిత్యం గా అంగీకారించలేని ఆ రోజులలో వారి పర్యవేక్షకులు ఖండవల్లి గారి ప్రోత్సాహంతో తెలుగు జానపద గేయ సాహిత్యం అనే గ్రంధం ను 17 ప్రకరణలతో తీసుకునివచ్చారు. ఇదీ 1972 లో M.A చదివే విద్యార్థులకు పాఠ్యాంశం గా వుంది. ఇప్పటికి జానపదం పై పరిశోధనలు చేసే విద్యార్ధులకు ఇదీ ప్రామాణిక గ్రంధం. constribution of andra to sanskrit literature అనే పరిశోధన గ్రంధం వీరు రాసారు. అయితె ఇదీ సంస్కృతం లో పిహెచ్ డి సాధించుట కొరకు రాసిన గ్రంధం ఇదీ. కానీ ఇదే అంశం పై ఆంధ్ర విశ్వ విద్యాలయం లో మరొకరు పరిశోధన చేస్తూన్నరనే కారణం తో రామరాజు గారు ఈ పరిశోధన ను కేవలం ఒక పుస్తకం గా ప్రచురించారు. ఈ గ్రంధం లో దాదాపు 200 మంది కవుల జీవిత విశేషాలున్నాయి.
తెలుగు సాహిత్యంలోనే కాదు ప్రపంచ సాహిత్యంలోనే యోగుల పై ఏక మొత్తం గా ఒక గ్రంధం రావడం అరుదైన విషయమే. తెలుగు యోగులు అనే పేరుతో మేడపాటి గారు దళిత యోగులు అనే పుస్తకం ఒక సంపుటం గా వచ్చాయి. అలా బి.రామ రాజు గారు యోగుల జీవిత చరిత్ర లను ఒక్కటి కాదు రెండు కాదు 7సంపుటాలుగా వందలాది యోగుల జీవితాలను సంకలనం చేసి మనకు అందించారు. ఒక క్షుద్రుడిలా జీవించడం వీరికి ఇష్టం వుండదు. అందుకే జీవితానికి ఆధ్యాత్మికతను జోడించి ఆంధ్ర యోగులు అనే చక్కని మంచి గ్రంధాలను తెగలిగారు. వీరి ప్రతిభ కు సకాలంలో సరియైన పదవులు దక్కపోయినా వీరు ఎప్పుడు కృంగిపోలేదు. భగవదిష్టమే తన ఇష్టం గా మలుచుకోని ముందుకీ సాగారు.
మహా పరిశోధకులు వేటూరి ప్రభాకరశాస్త్రి గారి ఒక పొరపాటును సవరించారు.వేటూరి తన చాటు పద్య మంజరి లో రాయలు వారిని మెప్పించిన బొడ్డుచర్ల తిమ్మన అనే వ్యక్తి. అలాగే ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధం రాసిన తిమ్మన ఒక్కరే అనీ ప్రతిపాదన చేసారు వేటూరి. కానీ బి .రామరాజు గారు పై గ్రంధాలను సంపాదించి 1962 లో పరిష్కారం చేసి ప్రరోచన అనే ముందుమాట రాస్తూ వీరిద్దరూ వేర్వేరు అనీ ఖచ్చితత్వం తో నిరూపణ చేసారు. గ్రంధ పరిష్కరణ అనేది ఏ కవికో రచయితకో సాధ్యమైనదో కాదు కేవలం సాహిత్యంలో ఉద్దండ పండితులు మాత్రమే చేయగలిగేది. అలాంటి పండితులే బి.రామరాజు గారు.
*బి.రామరాజు గారు చేసిన గ్రంధ పరిష్కరణలు*
* సాపయ వెంకటాద్రి - సకల జీవ సంజీవం (1975)
* విశిష్టాద్వేత రామానుజుల చరిత్ర
* చింతపల్లి ఛాయపతి - రాఘవాభ్యుదయం (1979)
* పాలవెకరీ కదిరిపతి - శుక సప్తతి (1979)
* కాళహస్త కవి - వసు చరిత్ర (సం)
* మధుర వాణి - రామాయణ సార తిలకం
* అభినవ కాళిదాసు - శృంగార శేఖరభాణం
* కాకతి ప్రతాపరుద్రుని - ఉషారాగోదయం
* అణ్ణయ్యచార్యుల - రసోదార భాణం
* మడికి సింగన - పద్మపురాణం
* పాల్కురికి సోమనాధుడు - పండితాదోహరణం
* తిరుమల బుక్క పట్టణం వెంకట శ్రీనివాసాచార్య - విజయ వైజయంతి
అంతేకాదు వెయ్యి స్తంభాల శాసనం మరియు జిన వల్లభుని శాసనం & గంగాధర శాసనం వంటివి వెలుగు చూడడానికి రామరాజు గారే ప్రధాన పాత్ర పోషించారు.
*వీరి పై వచ్చిన పరిశోధనలు*
* బి.రామరాజు వాజ్మయ సూచీ (2000-hcu) - పి.సుధాకర్
* ఆచార్య బి.రామరాజు జీవితం సాహిత్యం (2001-కేయూ) - కె.విజయలక్ష్మీ
పై రచనలతో పాటు దక్షిణ జానపద గీతాలను south indian flok songs గా ఆంగ్లంలో కి అనువదించారు. 39 జానపద కథలతో floktaile of andrapradesh అనే సంపుటం తెచ్చారు. అంతే కాకుండా జానపద సాహిత్యం పై ఎన్నో విలువైన వ్యాసాలు రాసారు. తెలుగులో జానపద రామాయణం అనీ రాసినా వీర గాధలను సేకరించినా పిల్లల పాటల గురించి చెప్పినా ఇవ్వన్నీ కూడా సాహిత్యం లో ఉత్తమ గ్రంధాలుగా నిలిచాయి. ఇలా వీరు తెలుగు వారికి జానపద సాహిత్యం ను కుప్పలు తెప్పలుగా పోసి వాగ్దేవి కి అభిషేకించి జానపద వాజ్మయ బ్రహ్మ గా పేరును పొందారు బి.రామరాజు గారు. చివరిగా వీరు సేకరించిన జానపద తత్త్వ గేయం తోనే ముగిస్తూ......
ఏ దారి వచ్చితివో
ఆ దారినే పోవ
ఇక జన్మమే లేదా చిలుకా
.......................................
.......................................
నీకిష్టమగు నామ
మైదియైనను కాని
నిత్యమనుచుండవే చిలుకా
అనగనగా ఆ నామమే
మనకుండినను గూడ
అన్నయట్లే యుండు చిలుకా
కాలంబు గడువగా గడువగా
అదీ విశ్వగానమైపోవునే చిలుకా....
ఐ.చిదానందం
ఫొన్ : 8801444335
బిరుదురాజు రామరాజు, అస్వస్థత కారణంగా [[2010]], [[ఫిబ్రవరి 8]] న [[హైదరాబాదు]] లో మరణించాడు.
|