కోయ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (9), typos fixed: రూ. → రు., తంను → తాన్ని , విజ్నాన → విజ్ఞాన, → (4), , → , (9), , → , (10)
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
'''కోయ''' (Koya) అనేది ఆంధ్ర ప్రదేశ్ లో నివసించే ఒక తెగ. [[ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా]]లో 18వ కులం. వీరు ఇంద్రావటి, [[గోదావరి]], శబరి, [[సీలేరు]] నదుల ప్రాంతాల్లోను మరియు, బస్తర్, కొరాపూట్, వరంగల్, [[ఖమ్మం]], [[కరీంనగర్]], ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తరించియున్న దట్టమైన అడవులైన తూర్పు కనుమలలోను కనిపిస్తారు. భారతీయ కుల వర్గీకరణ (Indian Caste classification) ప్రకారం వీరు షెడ్యూల్ ట్రైబ్ (Schedule Tribe) గ్రూపుకి చెందినవారు. 1991 జనాభా లెక్కల ప్రకారం వీరి సంఖ్య 1,40,000. దేశభక్తి, ఐక్యత ఎక్కువగా ఉన్న వీరు 1880 లో బ్రిటీషు పాలనపై తిరుగుబాటు చేశారు. భారతీయ స్వాతంత్ర్య పోరాట చరిత్ర ప్రకారం దీనినే కోయ తిరుగుబాటు అని అంటారు. కోయవారు మాట్లాడే భాష కోయి - తెలుగు భాషకు పోలికగా ఉంటుంది.
 
కోయవారి నమ్మకం ప్రకారం మొదటిగా జీవి నీటిలోని పుట్టింది. నాలుగు సముద్రాల మధ్య ఘర్షణ ఏర్పడి అందులోంచి నాచు, కప్పలు, చేపలు, సన్యాసులు పుట్టుకొచ్చారు. ఆఖరిగా దేవుడు పుట్టుకొచ్చి తునికి మరియు, రేగు పళ్ళను సృష్టించాడు. 18 వ శతాబ్దంలో మరాఠాలు పెట్టిన చిత్రహింసలు భరించలేక కొండల్లో తలదాచుకొన్నారు. ఈ సమయంలో యాత్రికులు వీరిని అనాగరికులు (Untouchables) గా పరిగణించేవారు. తరువాతి కాలంలో నిజాంవారు భద్రాచలం తాలూకాను బ్రిటీషువారి కిచ్చారు. ఆప్పుడు ఆ డివిజన్ లో 225 కోయ గ్రామాలుండేవి.
 
కోయవారిలో రాచకోయ, లింగదారి కోయ, కమ్మర కోయ మరియు, అరిటి కోయ అనే ఉప కులాలున్నాయి. ఈ ఉపకులాల్లోనే ఆహారపు అలవాట్లు ఒకలా ఉండవు. లింగదారి కోయలు గొడ్డు మాంసం (Beef) తినరు - ఇతరులతో భోజనం చేయరు. కులాంతర వివాహాల వచ్చే నష్టాలను నివారించడానికి కొన్ని పూజలు చేస్తారు. రాచ కోయలు గ్రామ పెద్దలుగా ఉంటారు. పండుగ సమయాల్లో వీరు కూడా కొన్ని పూజలు చేస్తారు. కమ్మర కోయలు వ్యవసాయ పనిముట్లను తయారు చేస్తారు. అరిటి కోయలు పాటలు పాడుతారు, వంశ వృక్షాలను వివరిస్తారు.
 
జీవిత భాగస్వామిని చర్చలద్వారా ఎన్నుకొంటారు. ఒక్కొక్కసారి అమ్మాయి (Bride) అబ్బాయి (Bride groom) ఇద్దరూ కలిసి లేచిపోవడం ఆ తర్వాత స్త్రీ పునరుత్పత్తి (Fertility) ని ప్రతిబంబించేలా అమ్మాయి మీద నీరు పోయడం వంటి నాటకోత్తర (dramatic) సన్నివేశాలు జరుగుతాయి. వివాహ వేడుకను రెండు గ్రామస్థులు కలిసి మూడు రోజులు జరుపుకొంటారు. ప్రతి వ్యక్తి ధాన్యాన్ని (grains), మద్యాన్ని (Alcohol) పెళ్ళికూతురి ఇంటికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. తాటి కల్లు (Palmyra toddy) ఎక్కువగా దొరికే ఎండాకాలంలో వివాహాలు జరుగుతాయి.
 
దహన సంస్కారాలు (Cremations) విభిన్నంగా జరుగుతాయి. శవాన్ని మంచం మీద పరుండబెట్టి, ఆ శవం ప్రక్కన ధాన్యం, కల్లు, క్రొత్త బట్టలు, డబ్బులు మరియు, ఆవు తోక పెట్టి అందరూ మోసుకెళ్ళి శవాన్ని తీసుకెళ్ళతారు. గర్భిణీ స్త్రీ మరియు, ఐదు నెలల లోపు పిల్లల శవాలను పాతిబెడతారు. 11వ రోజున 'దినం' పాటిస్తారు. ఆ సమయాల్లో ఆత్మ మరలా వచ్చి ఆనకుండ అనే మట్టికుండలో నివసిస్తుందని నమ్ముతారు.
 
==కోయభాషపై కొన్నిమాటలు==
పంక్తి 17:
కోయ గిరిజనుల పంచాయతీ విధానం:
 
కోయ గిరిజనులకు సంబంధించి ప్రత్యేక న్యాయ విధానం అమలులో ఉండేది. వీరి సమాజంలో వీటికి సంబంధించిన అంశాలు అంతర్లీనంగా కొనసాగుతూ వస్తుంటాయి. తమ తెగ ఆచార వ్యవహారాలు దీనిని అనుసరించే ఉంటాయి. దీనిలో తెగకి సంబంధించిన ప్రత్యేక వ్యక్తుల ప్రాధాన్యత ఉంటుంది. వీరు వంశపారంపర్యంగా విధులను నిర్వహిస్తూ వారి ఆచారవ్యవహారాలు గౌరవం కల్పిస్తూ తీర్పును వెళ్ళడిస్తారు.ఐతే వ్యక్తుల మధ్య కులాల మధ్య ఎలాంటి పొరపాట్లు జరిగినా, నష్టం కలిగినా తెగకు సంబంధించిన ప్రత్యేక వ్యవస్థ ద్వారా విచారిస్తారు.
 
వ్యక్తులు -ప్రాధాన్యత:
పంక్తి 23:
పంచాయతీ పరిష్కారానికి గూడెంకు సంబంధించి ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు.వీరితో పాటుగా గూడెంకు సంబంధించిన కొందరు వ్యక్తులు కూడా ఉండి వారు ఆయా గోత్రానికి ప్రతినిధులుగా వ్యవహరిస్తారు.వారిలో
 
1.పటేల్: ఇతడే గూడెంకు సంబంధించి పెద్ద. ఈ పదవి సాధారణంగా ఆ గూడాన్ని ఏర్పాటు చేసినపుడు ఉన్న మెుదటి వ్యక్తికి సంక్రమిస్తుంది. గిరిజనులు ఎక్కువ కాలం ఒకే చోట నివాసం చేయరూచేయరు.ఇలా ఒకచోటి నుండి మరొక చోటికి వెళ్ళాళంటే పటేల్ సలహా మరియు, అనుమతి అవసరం.విచారణ అనంతరం తుది తీర్పును పటేల్ వెళ్ళడిస్తాడు. క్రమంగా వంశ పారపర్యంగా ఆ కుటంబానికి చెందిన వ్యక్తులు పటేల్ గా వ్యవహరించే అధికారం సిధ్దిస్తుంది.
 
2.పిన పెద్ద: పటేల్ తర్వాత రెండవ ప్రాధాన్యత కలిగిన వ్యక్తి పిన పెద్ద. ఇతను కూడా గూడెం ఏర్పడినపుడు ఉన్న ప్రధాన వ్యక్తి.పంచాయతీ విధానంలో ఇతని తీర్పు కూడా కీలకమైనదే.
 
3.పూజారి:గూడెంకు సంబంధించిన కుటుంబాలకు మరియు, ఆ గూడెంలోని దేవతలకు పూజిస్తూ పూజరిగా పిలవబడతాడు.ఇతను కూడా వంశపారంపర్యంగా విధులను కొనసాగించే హక్కు ఉంది. గూడెంకు సంబంధించిన సామూహిక పూజా కార్యక్రమాలు, మంచిరోజు,ముహూర్తంను ముహూర్తాన్ని నిర్ణయించేది పూజారే.కేవలం పూజలకే కాక గూడెంకు సంబంధించిన పంచాయతీలో ప్రధాన వ్యక్తిగా ఇతనికి ప్రాధాన్యత ఇస్తారు.
 
4.ఏపారి: గూడెంకు సంబంధించిన సామూహిక పనులు మరియు, సమాచారాన్ని ప్రజలందరీ చేరవేయడం ఇతని ప్రధాన కర్తవ్యం. పంచాయతీ జరిగే సమయంలో అందరినీ పిలుచుకురావడం మరియు, కుల పెద్దలు చెప్పిన విధులను నిర్వర్తిస్తుంటాడు.
 
పంచాయతీ రకాలు:
 
గతంలో భూ ఆక్రమణ, అక్రమ సంబంధం లాంటివి పెద్దల దృష్టికి తీసుకువచ్చి పంచాయతీ ఏర్పాటు చేసి పెద్దల సమక్షంలో పరిష్కారం జరిపేవారు.ఇలా తిరిగి జరగకుండా ఆ తెగకు సంబంధించిన ప్రజలు జాగ్రత్త పడేవారు.పంచాయతీలో ప్రధానంగా తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఆలూమగల పంచాయతీ, దొంగతనాలు, ఆక్రమణలు, భూ తగదాలు, అత్తాకోడళ్ళ పంచాయతీ, ఆస్తి తగాదాలు, విడాకులు, అక్రమసంబంధం, బలాత్కారం వంటి ఎన్నో రకాలైన పంచాయతీలు ఉంటాయి. ఇందులో చాలా వరకూ ఆవేశంతో కూడుకుని చేసుకునే పంచాయతీలే ఉంటాయి.
 
శిక్షలు-విముక్తి చర్యలు:
 
తెగకు మచ్చ తెచ్చే విధంగా కట్టుబాట్లను అధిగమించినపుడు వెలివేయడం తీవ్రమైన శిక్ష.అటువంటివారికి ఇటు గూడెం నుండి కాకుండా పొరుగు గూడాలకు కూడా విషయం తెలియడం వల్ల వీరిని దరికి రానివ్వరు.శిక్షను అనుభవించేవారు నీళ్లు ముట్టరాదు, పండుగల్లో పాలుపంచుకోరాదు.వారికి ఆపద వస్తే పలకరించరు.ఇలాంటి కఠిన నియమాలు అమలుచేయడం వల్ల కొన్ని రోజుల్లోనే తప్పును గ్రహించి తిరిగి కులంలో కలవడానికి పెద్దల అంగీకారం తీసుకుని శిక్షల నుండి విముక్తి పొందేవారు.
 
==లంకెలు==
పంక్తి 43:
*http://en.wikipedia.org/wiki/Koya_language
*http://garph.co.uk/IJARMSS/Nov2012/1.pdf
జానపద గిరిజన విజ్నానం విజ్ఞానం జాతీయ సదస్సుల పత్రాలు (పెజీ 93-95)
 
[[వర్గం:తెగలు]]
[[వర్గం:కులాలు]]
"https://te.wikipedia.org/wiki/కోయ" నుండి వెలికితీశారు