ప్రోలయ వేమారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు తొలగించబడింది; వర్గం:ఆంధ్రప్రదేశ్ చారిత్రిక వ్యక్తులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 4:
[[రెడ్డి రాజులు|రెడ్డి రాజవంశం]] యొక్క మొదటి రాజు '''ప్రోలయ వేమారెడ్డి'''. వేమారెడ్డి 1325-1353 మధ్యకాలంలో రాజ్య పాలన చేశాడు. వీరి [[రాజధాని]] మొదట [[అద్దంకి]]. తరువాత [[కొండవీడు]]. [[కాకతీయ సామ్రాజ్యం]] 1323లో పతనమయ్యింది. అప్పుడు, అనగా 1324-25 కాలంలో, కాకతీయ సేనానులలో ఒకడైన ప్రోలయవేమారెడ్డి స్వతంత్రంగా [[కందుకూరు]] మొదలు [[గోదావరి|గోదావరీ]] తీరంవరకు తన రాజ్యాన్ని అద్దంకి రాజధానిగా స్థాపించాడు. [[కొండపల్లి]] కోటను కొండవీటి రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డి 14 వ శతాబ్దంలో నిర్మించినట్లు భావిస్తున్నారు. దీనిలో మూడంతస్తుల రాతి [[బురుజు]] ఉంది. తీరాంధ్రప్రజలను తురుష్కదండయాత్రల నుండి కాపాడిన వారిలో వేమారెడ్డి, అతని సోదరుడు మల్లారెడ్డి ముఖ్యులు.
వేమారెడ్డి రైతులు
ప్రోలయ అతని ఆస్థాన [[కవి]]యే [[ఎఱ్ఱాప్రగడ]]. ఎఱ్ఱాప్రగడ 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆ రాజు ఆస్థానంలోనే తన సాహితీజీవితాన్ని కొనసాగించాడు. ప్రోలయవేమారెడ్డి ఆస్థానంలో చేరడానికి ముందు [[ఎర్రన]] చేసిన రచనలగురించి ఏ విధమైన వివరాలూ లేవు. ఎర్రన రచనలన్నీ వేమారెడ్డి ఆస్థానంలో ఉండగానే సాగాయి. ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న ఎర్రాప్రగడ ఆంధ్రమహాభారతాన్ని ఇక్కడే పూర్తిచేశాడు.
|