'''కేదారేశ్వర వ్రతం''' [[హిందువు]]లు ఆచరించే ఉత్కృష్టమైన [[వ్రతము]].
[[కార్తీక మాసము]] లో చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు [[కార్తీక పౌర్ణమి]] వస్తుంది. ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోను [[శివుడు|శివుడి]]ని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.
ఈ వ్రత మహత్యం వలననే [[పార్వతీదేవి]] శివుని అర్థశరీరాన్ని పొందినదని పురాణ ప్రతీతి.
; ఆచమనీయం:
మునిభిర్నా రదప్రఖ్యైర్నిత్యరథప్రఖ్యైర్నిత్య మాఖ్యాత వైభవః
కేదారదేవ భగవాన్ గృహాణా చమనం విభో
; గంధం:
సమస్త గ్రంధద్రవ్యాణాంగ్రంథద్రవ్యాణాం - దేవత్వమసి జన్మభూః
భక్త్యాసమర్పితం ప్రీత్యా - మయాగంధాది గృహ్యతామ్
తతః ఇంద్రాది లోకపాలక
పూజాం కుర్యాత్ శివస్య దక్షిణేభాగే {కుడివైపు} బ్రహ్మణేనమఃబ్రాహ్మణేనమః ఉత్తరభాగే {ఎడమవైపు} విష్ణవేనమః మధ్యే కేదారేశ్వరాయ నమః
==అథాంగ పూజ==
==అధసూత్ర గ్రంధిపూజ==
{{Div col|cols=3}}
# ఓం శివాయ నమః ప్రధమప్రథమ గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం శాంతాయ నమః ద్వితీయ గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం మహాదేవాయ నమః తృతీయ గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం వృషభద్వజాయ నమః చతుర్ధ గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం గౌరీశాయ నమః పంచమ గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం రుద్రాయ నమః షష్ఠ గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం పశుపతయే నమః సప్తమ గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం భీమాయ నమః అష్టమ గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం త్రయంబకాయ నమః నవమ గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం నీలలోహితాయ నమః దశమ గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం హరాయ నమః ఏకాదశ గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం స్మరహరాయ నమః ద్వాదశ గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం భర్గాయ నమః త్రయోదశ గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం శంభవే నమః చతుర్ధశ గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం శర్వాయ నమః పంచదశ గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం సదాశివాయ నమః షోఢశ గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం ఈశ్వరాయ నమః సప్తదశ గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం ఉగ్రాయ నమః అష్టాదశ గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం శ్రీకంఠాయ నమః ఏకోన వింశతి గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం నీలకంఠాయ నమః వింశతి గ్రంధింగ్రంథిం పూజయామి
# ఓం మృత్యుంజయాయ నమః ఏకవింశతి గ్రంధింగ్రంథిం పూజయామి
{{Div end}}
వాక పక్షసముదాయంతో నానావిధ ఫలపుష్ప తరు లతాదులతో కూడుకొనిన్న సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది.
ఆశ్రమవాసులామెను చూచి అతిధిఅతిథి మర్యాదలొనర్చిమర్యాదలోనర్చి తల్లీ నీవెవ్వరవు ఎవరిదానవు ఎచటనుండి వచ్చితివి నీరాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వాతి మిక్కిలి ఆనందించినదై యఙ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమ నిష్టాగరిష్టులైనిష్టాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివుని సతిగా నా నాధునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చినదానను అన్నది పార్వతి. మహర్షులారా ! జగత్కళ్యాణాభిలాషులారా! నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడని పార్వతి వారిని కోరుకున్నది.
అందుకు గౌతముడు పార్వతీ ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రతవిధానమును వివరించమని పార్వతి గౌతముడ్ని కోరింది. జగజ్జననీ ఈ వ్రతాన్ని ఆసీవీజ మాసంలో శుక్ల పక్షంలో అష్టమియందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండవలెను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటినుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను. మరియు, ధాన్యరాశిని పోసి అందు పూర్ణకుంభము నుంచి ఇరువది యొక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. దేవీ ఇరవై ఒక్కమంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చండబెట్టి యధావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య - భోజ్య, నైవేద్యాదులు కదళీఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణలిచ్చి వారలను తృప్తి పరచవలెను. ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్టసిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు.
గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తనమేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంగ తరంగయై భర్తతో నిజనివాసము కైలాసమున కోరెను.
ఆతదనంతరం ఉజ్జయినీ నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి యను ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనకా మాకు కేదార వ్రతము చేయుటకు అనుఙ్ఞనిమ్మని అడిగారు. అందుకాతడు బిడ్డలారా ! నేను దరిద్రుడను. సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరా ఆలోచనను మానుకోండని పలికెను. అందుకా వైశ్యపుత్రికలు నీ ఆఙ్ఞయే మాకు ధనము అనుఙ్ఞ నియ్యవలసినదని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షం క్రింద కూర్చుని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారలకు పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు.
ఆ వైశ్య పుత్రికలకు యుక్తవయసు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనదాన్యధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంత కాలానికి చిన్నకుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదార వ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది, ఆమె భర్త ఆమెను, కుమారుడ్ని రాజ్యము నుండి వెడలగొట్టివేసాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడ్ని చేరబలిచి నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్ధించి తీసుకొని రావలసిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినీకి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడ్ని సాగనంపింది. అతడు తిరిగివస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత దనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరురూపుడైన శివుడా సొమ్మును తీసుకొనిపోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయి ! నీవు ఎన్నిసార్లు నీ పెద్దతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు.
అప్పుడామెఅప్పుడామే బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడా ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మందీ మార్భలముతో వచ్చి ఆమెను, కుమారుడ్ని రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది.
ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివిన , విన్న అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యము పొందుదురు.
'''శ్రీ కేదారేశ్వర వ్రతం సమాప్తం.'''
|