ధృష్టద్యుమ్నుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీశైలి దిద్దుబాట్లు
ట్యాగు: 2017 source edit
విస్తరించాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''[[దృష్టద్యుమ్నుడు]]''' [[ద్రుపదుడు|ద్రుపదుని]] కుమారుడు. [[ద్రౌపది]] అన్న. [[ద్రుపదుడు]] చేసిన యజ్ఞంలో [[ద్రౌపది]]తో పాటు దృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు. తన మిత్రుడు తనను అవమానించిన పాండవుల గురువు [[ద్రోణాచార్యుడు|ద్రోణుని]] సంహరించేందుకు ద్రుపదుడు తపస్సు చేయగా వరం చేత దృష్టద్యుమ్నుడు జన్మించాడు. ఇతడు [[కురుక్షేత్ర సంగ్రామం|కురుక్షేత్ర]] యుద్ధంలో పాండవుల సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుని హతమార్చి, తన తండ్రి ద్రుపదుని కోరికను నెరవేర్చాడు. చివరికి ద్రోణుని కుమారుడు [[అశ్వత్థామ]] చేతిలో ఘోరంగా మరణించాడు.
 
== కథ ==
దృష్ణద్యుమ్నుడు పుట్టడమే ద్రోణున్ని సంహరించడానికి పుడతాడు. అయినా సరే ద్రోణుడు అతన్ని శిష్యుడిగా స్వీకరిస్తాడు. ద్రౌపది స్వయంవరం సమయంలో ధనుర్విద్యలో గెలిచి తన చెల్లెల్ని వివాహం చేసుకున్న బ్రాహ్మణ యువకుణ్ణి వెంబడిస్తూ వెళ్ళి అతను పాండవ మధ్యముడు [[అర్జునుడు]] అని కనుగొంటాడు.<ref name="Positive thinking: Dhrishtadyumna">{{cite news|title=Positive thinking: Dhrishtadyumna|url=http://www.dnaindia.com/analysis/comment_positive-thinking-dhrishtadyumna_1774478|newspaper=DNA|date=7 December 2012}}</ref>
 
== యుద్ధం ==
కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడి తర్వాత ద్రోణాచార్యుడు సర్వసేనాధ్యక్షడవుతాడు. ద్రోణుడు ఆయుధం పట్టుకుంటే అతన్ని ఎదిరించి ఎవరూ పోరాడలేరని భావించిన శ్రీకృష్ణుడు ''అశ్వత్థామ హతః'' (అశ్వత్థామ చనిపోయాడు) అని పెద్దగా ''కుంజరః'' (ఏనుగు) అని చిన్నగా వినపడకుండా ధర్మరాజు చేత అనిపిస్తాడు. అది విని ఆయుధాన్ని విసర్జిస్తాడు ద్రోణుడు. అదే సమయంలో అతని శిరసు ఖండించి సంహరిస్తాడు దృష్టద్యుమ్నుడు. మాయోపాయంతో తన తండ్రిని చంపిన విధానాన్ని చూసి కోపంతో రేగిపోతాడు అశ్వత్థామ. పాండవులనందరినీ చంపి తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. రాత్రి సమయంలో పాండవుల శిబిరానికి వెళ్ళి ఉపపాండవులు (ఐదుమంది)తో పాటు దృష్టద్యుమ్నుడిని కూడా సంహరిస్తాడు. పాండవులు, కృష్ణుడు శిబిరానికి తిరిగి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి అశ్వత్థామపై పగ తీర్చుకోవాలనుకుంటారు. యుద్ధంలో పాండవులు ఎదురైనప్పుడు వారిని సంహరించడానికి [[బ్రహ్మాస్త్రము|బ్రహ్మాస్త్రాన్ని]] ప్రయోగిస్తాడు. ప్రతిగా అర్జునుడు [[పాశుపతాస్త్రం|పాశుపతాస్త్రాన్ని]] ప్రయోగిస్తాడు. అవి రెండూ ఉపసంహరించుకోకపోతే ప్రళయం సంభవించి జగత్తు మొత్తం నాశనమైపోతుందని దేవతలు వారిని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ మాత్రం ఉత్తర గర్భంలో ఉన్న శిశువును సంహరిస్తే పాండవుల వంశం నశిస్తుందని అలా ప్రయోగిస్తాడు. కాని కృష్ణుడు ఆ బిడ్డను తిరిగి బతికించి, అలాంటి పాపపు పనిని చేసినందుకు అతని నుదుటిపై ఉన్న మణిని తీసివేయమంటాడు.<ref>{{Cite web|url=https://www.india.com/festivals-events/mahabharat-mythology-is-ashwatthama-still-alive-even-after-5000-years-4048516/|title=Mahabharat Mythology: Is Ashwatthama Still Alive Even After so Many Years?|last=Staff|first=India com|date=2020-06-04|website=India News, Breaking News, Entertainment News {{!}} India.com|language=en|access-date=2020-06-08}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ధృష్టద్యుమ్నుడు" నుండి వెలికితీశారు