దోణప్ప [[అనంతపురం జిల్లా]] [[రాకెట్ల]]లో సంజీవప్ప, తిమ్మక్క దంపతులకు ఎనిమిదవ సంతానంగా [[1926]], [[జూలై 1]]వ తేదీ జన్మించాడు. ఇతడి మొదటి పేరు '''దోణతిమ్మారాయ చౌదరి'''. తాతగారైన తూమాటి భీమప్ప వద్ద చిన్ననాటనే మాఘం తప్ప మిగిలిన సంస్కృత పంచకావ్యాలు, తెలుగు పంచకావ్యాలు చదివాడు. నంజయ్య వద్ద గురుబాల ప్రబోధిక చదివాడు. భాగవత ప్రవచనం చేశాడు. [[వజ్రకరూరు]]లోని హయ్యర్ ఎలిమెంటరీ స్కూలులో 1939-42సం||ల కాలంలో ఐదు నుండి ఎనిమిదవ తరగతి వరకు చదివాడు.1942-46 సం. ల మధ్య కాలంలో [[ఉరవకొండ]]<nowiki/>లోని కరిబసవ స్వామి జిల్లా బోర్డు ఉన్నతపాఠశాలలో చదివాడు. ఈ సమయంలో [[నూతలపాటి పేరరాజు]] అనే [[తెలుగు]]పండితుడు ఇతనికి గురువుగా ఉండేవాడు. అతడి నుండి ఆశుకవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు. 1948లో [[అనంతపురం]]లోని [[దత్తమండల కళాశాల]]లో ఇంటర్మీడియట్లో చేరాడు. అక్కడ శంఖవరం రాఘవాచార్యులు, కారెంపూడి రాజమన్నారు, మిక్కిలినేని వేంకటేశ్వరరావు, [[చిలుకూరి నారాయణరావు]] మొదలైనవారు ఇతని గురువులు.1949-52సం.ల మధ్య [[ఆంధ్రవిశ్వవిద్యాలయం]]లో బి.ఎ. ఆనర్స్ చదివాడు. అక్కడ [[గంటి జోగి సోమయాజి]], [[దువ్వూరి వేంకటరమణ శాస్త్రి]], కాకర్ల వెంకటరామ నరసింహం, [[భద్రిరాజు కృష్ణమూర్తి]], ఓరుగంటి రామచంద్రయ్య, మధుసూదన షడంగి, వజ్ఝల చినసీతారామస్వామి మొదలైన హేమాహేమీలు ఇతని గురువులుగా ఉండేవారు. 1953లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి ఎం.ఎ.ఆనర్సులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని సాధించాడు. ఆ సమయంలో ఇతనికి [[అనకాపల్లి]] కళాశాల వారు మొట్టమొదటే ఆంధ్రశాఖ అధ్యక్షపదవి ఇస్తామని ఆహ్వానించారు. [[గుడివాడ]] కళాశాల వారు కూడా ఆహ్వానించారు. కాని ఇతడు ఈ రెండు అవకాశాలను కాదని [[గంటి జోగి సోమయాజి]]వద్ద పరిశోధక విద్యార్థిగా చేరి "తెలుగులో వైకృతపదాలు" అనే అంశంపై పరిశోధించి 1966లో [[పి.హెచ్.డి]] సంపాదించాడు.