బొడ్డు గోపాలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
వీరు [[గుంటూరు జిల్లా]] [[తుళ్ళూరు]] గ్రామంలో రామదాసు దంపతులకు [[1927]] జనవరిలో జన్మించారు. తండ్రి సంగీత కళాకారుడు కావడం చేత గోపాలంకి సంగీతంపై గల అభిమానాన్ని గుర్తించి వీరిని [[విజయవాడ]]లో సంగీత విద్వాంసులైన వారణాసి బ్రహ్మయ్య శాస్త్రి వద్ద చేర్చారు. అక్కడ గాత్ర సంగీతంతో పాటు వయోలిన్ కూడా నేర్చుకున్నారు. 1944లో [[గుంటూరు జిల్లా]] ప్రజా నాట్య మండలిలో సంబంధము ఏర్పడింది. [[వేములపల్లి శ్రీకృష్ణ]], [[షేక్ నాజర్]], వేపూరి రామకోటి మున్నగు వారితో తోడు. శ్రీకృష్ణ వ్రాసిన "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా" పాటకు, పులుపుల శివయ్య గారి "పలనాడు వెలలేని మాగాణిరా" పాటకు స్వరరచన చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలములో హిట్లర్ సైన్యానికి వ్యతిరేకముగా, సోవియట్ సేనలకు [[విజయము]] కలగాలని పాటలు వ్రాసి పాడేవాడు. "స్టాలినో నీ ఎర్ర సైన్యం" అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది.
 
విజయవాడ రేడియో కెంద్రములో ఎంకి-నాయుడు బావ, భక్త రామదాసు వంటివాటితో పాటు, కృష్ణశాస్త్రి, విశ్వనాథ వారి సంగీత రూపకాలు, గేయాలు పాడాడు. రేడియో గాయని రేణుకతో పరిచయం పెళ్ళికి దారి తీసింది. 1952లో తాతినేని ప్రకాశరావు పిలిపు మేరకు మద్రాసు వెళ్ళి [[ఘంటసాల]] వద్ద సహాయకులుగా చేరాడు. [[పల్లెటూరు]], బతుకుతెరువు, [[పరోపకారం]] సినిమాలకు పనిచేశాడు. తరువాత నలదమయంతి చిత్రానికి సంగీత దర్శకుడుగా చేశాడు. నాగభూషణం గారి [[రక్తకన్నీరు (నాటకం)|రక్తకన్నీరు]], కలికాలం, పాపం పండింది, [[నాటకాల రాయుడు]] నాటకాలకు [[సంగీతము]] సమకూర్చాడు. 1972-84 ప్రాంతములో వెంపటి చినసత్యంతో శ్రీనివాస కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పారిజాతాపహరణం, నృత్య రూపకాలకు నేపథ్య గానం ఇచ్చి దేశ విదేశాలలో పర్యటించాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/బొడ్డు_గోపాలం" నుండి వెలికితీశారు