మహేంద్రగిరి: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ మహేంద్రము ను మహేంద్రగిరి కు తరలించారు: మరింత సరైన పేరు
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
== పౌరాణిక ప్రశస్తి ==
'''మహేంద్రగిరి ప్రసక్తి రామాయణంలో ఉంది.''' ఏడు కులపర్వతాల్లో మలయ, సహ్యాద్రి, పారిజాత, శుక్తిమంత, వింధ్య, మాల్యవంత లతో పాటు ఇది కూడా ఒకటి.<ref>{{harvnb|Mahendragiri: the pride of Eastern Ghats|1993|p=75|Ref=ma}}</ref> ఇది కొంతకాలము పరశురామునికి నివాసస్థలముగాను ఉండేది. ఇక్కడ ఉన్నప్పుడే పరశురాముఁడు, వివాహము చేసికొని మిథిల నుండి వస్తున్న శ్రీరాముని ఎదిరించి ఓడిపోయాడు. అతనికి విశ్వకర్మ నిర్మితమైన విష్ణుధనస్సును ఇచ్చాడు.<ref>{{harvnb|Mahendragiri: the pride of Eastern Ghats|1993|p=77|Ref=ma}}</ref>
బ్రహ్మ హరిహరుల గురించి మహేంద్రగిరిపై తపస్సుచేసి భీమేశ్వరాలయాన్ని నిర్మించాడని అంటారు. పరశురాముడు సమస్త క్షత్రియులని వధించాక మహేంద్రగిరిపై తపస్సులో నిమగ్నుడయినాడు.బలరాముడు మహేంద్రగిరిపై ప్రతిష్ఠించిన మూడు లింగాలలో గోకర్ణేశ్వర లింగం ఒకటి.నేటికి కూడా ఉత్తర శ్రీకాకుళం, గుంజాం ప్రాంతాల ఊళ్ళలో పరశురామవేషధారి గొడ్దలి పట్టుకొని ఉరరూపంతో వచ్చి ఇంటింటికివచ్చి బియ్యాలెత్తుకోవడం కనబడుతుంది. బలరామక్షేత్రమైన శ్రీకాకుళం జిల్లా ప్రాంతంలో కోలువర్తని, వరాహవర్తని, రూపవర్తని (టెక్కలి), జలుమూరు మహేంద్రభోగం అన్నవి భాగాలు.
పాండవులు తమ అజ్ఞాతవాసం మహేంద్రగిరిపై ఉండగా అర్జునుడు సముద్రతీరానికి వెళ్ళాడు.అక్కడ తెలియక ఒక గోవుని బాణంతో చంపాడు. గోవని తెలిసాక భీతిల్లి దీనిని మహేంద్రగిరిపై ఉన్న తమ్ముల దగ్గరకి తీసుకు వెళ్తుండగా దాని కోటిరక్తపుచుక్కలు బారువలోపడి అక్కడ కోటిలింగేశ్వరుడు వెలిసాడని పాప పరిహారార్ధం పాండవులు మహేంద్రగిరిపై లింగాన్ని ప్రతిష్ఠించారని జనశృతి. ....కళింగ మహిష మహేంద్ర భౌమాన్ గుహా భోక్ష్యయంతి అనే విష్ణు పురాణం కధనం బట్టి ఆరాజ్యాలను గుహుడనే రాజు ఏలినట్లు తెలుస్తున్నది. క్రీ.శ.277-304 లేదా 334-361 సమకాలికుడూ బౌద్ధమతావలంబికుడు అయిన గుహుడనే ఒకరాజు ఉన్నాడు అతడే ఈగుహుడని చారిత్రుకుల అభిప్రాయము.గుప్తులు ప్రయాగ, సాకేత, మగధలతో గంగాతీరాల రాజ్యమేలుతున్న కాలంలో ఈగుహుడు దంతపురాన్ని (శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న ఆముదాలవలస దంతవక్తృకోట దగ్గర ప్రాంతం) రాజధానిగా పాలించేవాడు.ఇతడు సముద్రగుప్తుని కంటే మునపటివాడు.గుహునుకి మునుపు దాదాపు 800 సం.క్రితం మహాపరి నిర్వాణకాలాన (క్రీ.పూ.483 లేక 486-87) మల్ల రాజధాని కుశి నగరం నుంచి అప్పటి కళింగ రాజయిన బ్రహ్మదత్తుని చే తేబడిన బుద్దుని నాల్గవ ఎడమకోరపన్ను (కళింగులకి వచ్చిన బుద్ధుని అవశేషం) దంతపురంలో స్థాపితం చేయబడి ఉండేది.ఆ దంతం శుభదాయకమని తెలుసుకొని, బౌద్దమతంలోనికి మారి, దానిని మరింత భద్రంగా కాపాడుతుండెవాడు.దయాళువు, దాత అయి రక్తపాతాన్ని విడనాడి ప్రజారంజకంగా పాలించేవాడు.గుప్తులు మగధలో బలబంతులైనాక పాండులు క్షీణిస్తున్న సమయంలో గుహుడు పాండులనుంచి వీడి స్వతంత్ర రాజ్యం చేసినాడు. కాని బుద్దుని దంతం స్వంతం చేసుకోవటానికి ఇతనిపై దండెత్తి క్షీరధరుడను రాజుచేత చంపబడినాడు. ఈ దంతపురం మహేంద్రగిరి ప్రాంతంలో ఉన్నది. గుహుడు తరువాత చాలా కాలం బుద్దుని నాల్గవ దంతం ఆతని కుమార్తె చేత శ్రీలంక పంపబడినది, అటుపై దానిని మరల పూరీ దేవాలయం ప్రాంతమునకు తేవబడినది. అక్కడే ఒక ఆరామంలో ఉంచబడినది. అటుపై వాటిపై పూరీ ఆలయం నిర్మించబడి ఉండవచ్చును.
 
అలానే ఒరిస్సానుంచి మధురై జిల్లావరకు సాగిన కనుమల్ని మహేంద్ర పర్వతాలని అనటం కూడా ఒక ఆనవాయితీ ఉన్నది.గంజాం, శ్రీకాకుళం జిల్లాలలోని తూర్పుకనుమల్ని ఇప్పటికీ మహేంద్రమౌళి అంటారు.[[కాళిదాసు]] వీటినే మహేంద్రమని స్పష్టంగా పేర్కొన్నాడు.వీటి స్థితి కళింగంలో అనికూడ చెప్పాడు.అంతేకాడు కళింగరాజుని మహేంద్ర ప్రభువన్నాడు.
 
అటుపై కళింగాన్ని పాలించిన తూర్పు గాంగులు మహేంద్రగిరిపై వెలసిఉన్న గోకర్ణేశ్వరుడు వరంతో రాజ్యాన్ని స్థాపించారు అన్నది ప్రసస్థి.వీరు అక్కడ దేవునికి ఒక మందిరాన్ని నిర్మించారు కూడా.వీరు గోకర్ణేశ్వరుడుని తమ కులదైవంగా వారి శాసనాలలో పేర్కొన్నారు.ఈయననే మలిగాంగులు మధూకేశ్వరునిగా వర్ణించారు.
 
== బయోస్ఫియరు ==
"https://te.wikipedia.org/wiki/మహేంద్రగిరి" నుండి వెలికితీశారు