సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
31 జూలై నాటికి కనీసం ముగ్గురు సుశాంత్ అభిమానులు సుశాంత్ వలె నే ఆత్మాహుతికి పాల్పడ్డారు. వీరిలో ఒక టీవీ నటుడు <ref>[https://www.scmp.com/lifestyle/health-wellness/article/3095335/sushant-singh-rajput-suicide-bollywood-actors-death సుశాంత్ కు మల్లే ఉరి వేసుకొన్న టీవీ నటుడు]</ref>, ఒక 13 ఏళ్ళ బాలిక కూడా కలరు <ref>[https://www.outlookindia.com/newsscroll/upset-about-actors-death-minor-girl-kills-self-in-cgarh/1900954 అలానే ఉరి వేసుకొని మరణించిన మరొక బాలిక]</ref>.
 
రియాపై అభియోగాల మోపబడ్డ తర్వాత రియాను దూషిస్తూ, బెదిరిస్తూ భోజ్ పురి భాషలో చిత్రీకరించబడ్డ గీతాలు కొన్ని బీహార్ లో జనాదరణ పొందాయి <ref>[https://www.bollywoodhungama.com/news/bollywood/sushant-singh-rajput-death-bihar-breaks-songs-bashing-rhea-chakraborty/]</ref> .
 
సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సుషాంత్ కోసం సామూహిక ప్రార్థన (Global Prayers for SSR) తలపెట్టింది. 15 ఆగస్టు స్థానిక కాలమానం ప్రకారం ఉ: గం| 10.00 | ని కి సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఈ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రకటించింది <ref>[https://www.dnaindia.com/bollywood/report-global-prayers-for-ssr-ankita-lokhande-sushant-singh-rajput-s-sister-shweta-singh-kirti-request-people-to-share-images-2837601]</ref>. కుటుంబ సభ్యులు మరియు అభిమానులతో బాటు బాలీవుడ్ కు చెందిన కృతి సనన్, అంకిత లోఖండే మరియు ఏక్తా కపూర్ ఈ ప్రార్థనలో పాలుపంచుకొన్నారు <ref>[https://www.indiatoday.in/movies/celebrities/story/kriti-sanon-and-ankita-lokhande-join-sushant-singh-rajput-s-family-in-global-prayers-for-ssr-1711530-2020-08-15]</ref>. <ref>[https://www.indiatvnews.com/entertainment/celebrities/kriti-sanon-ankita-lokhande-others-join-sushant-singh-rajput-s-family-for-global-prayer-meet-642268]</ref>
 
సుశాంత్ కేసు ప్రసార మాధ్యమాలలో విస్తృతంగా, అవిరామంగా చర్చించబడింది. 3 సెప్టెంబరు 2020 రెండు PIL (Public Interest Litigation) లను పరిగణలోకి తీసుకొంటూ ముంబయి పోలీసు కు వ్యతిరేకంగా "అనుచిత, దురుద్దేశ్యపూర్వకంగా మరియు ప్రసార మాధ్యమాలలో తప్పుడు ప్రచారాన్ని" ఉద్దేశ్యించి బొంబాయి హై కోర్టు, "ఈ కేసు విచారణకు ఏ విధమైన అడ్డుకట్టలు పడకుండా ఉండేలా ప్రసార మాధ్యమాలలో తమ ప్రచారాన్ని నిగ్రహించుకోవాలని కోరుతున్నాం మరియు ఆశిస్తున్నాం". అని సలహా ఇచ్చింది. 5 అక్టోబరు 2020న ముంబయి పోలీసు మరియు దాని అనుబంధ సైబర్ యూనిట్ సాంఘిక మాధ్యమాలు 80,000 కు పైగా ఫేక్ అకౌంట్ ల ను గుర్తించారు. ఆసియా, ఐరోపా ఖండాలలోని వివిధ దేశాల నుండి ఈ అకౌంట్లు వారి అధికారిక విచారణకు అపకీర్తి తెచ్చేలా పోస్టులు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు కమీషనర్ పరం వీర్ సింగ్, "అప్పటికే 6,000 మంది పోలీసు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకి ఉంది. 84 పోలీసు ఉద్యోగులు వైరస్ వల్ల మృతి చెందారు. ఈ దుష్ప్రచారాలు మా మీద బురద చల్లటానికి, విచారణను ప్రక్కదారి పట్టించటానికి చేయబడ్డాయి. చట్టాన్ని అతిక్రమించిన వారి పై Information Technology Act చట్టం క్రింద కేసు నమోదు చేస్తాం." అని తెలిపారు.