రామమోహన గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గ్రంథాలయాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 2:
 
==చరిత్ర==
[[బ్రహ్మసమాజం]] వారు 1903 లో ఆస్తిక పుస్తక భాండాగారం అను పేర ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పారు. ఇందుకు ఈ. సుబ్బుకృష్ణయ్యగారు, కలకత్తాకు చెందిన బాబు హేమచంద్ర సర్కార్, లండన్ నగరంలో గల బ్రిటిష్ అండ్ ఫారన్ యూనిటేరియన్ సంఘం 200 పుస్తకాలను ఉచితంగా ఇచ్చారు. కానీ కొన్ని కారణాలవలన ఒక దశాబ్దంలోపలే అది మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆకాలంలో [[అయ్యంకి వెంకటరమణయ్య]], అయ్యదేవర కాళేశ్వరరావు, గోపరాజు బ్రహ్మానందం, పాటిబండ్ల సుబ్రహ్మణ్యం మొదలైన కొందరు యువకులు దానిని పునర్నించింది దీనికి ప్రముఖ సంస్కర్త [[రాజా రామమోహన రాయ్]] పేరన "రామమోహన ధర్మ పుస్తక భాండాగారమ"ని 1911 లో నామకరణం చేశారు. అయ్యంకి వారు దానికి కార్యదర్శిగా అన్నీ తానే చూసుకున్నారు.<ref>గ్రంథాలయ పితామహ అయ్యంకి వెంకట రమణయ్య, డాక్టర్. వెలగా వెంకటప్పయ్య, పాతూరి విజయకుమార్, వాహినీ పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, 1982. పేజీ. 54</ref>
==భవన నిర్మాణం==
1912లో బందరు రోడ్డులో ఈ గ్రంథాలయం గల స్థలం వేలానికి వస్తే పురపాలక సంఘం వారినుండి దీనిని కొన్నారు. దానికి అవసరమైన ధనాన్ని చందాలు ప్రోగుచేశారు. కొంత ఖర్చును మునగాల రాజా నాయని వెంకట రంగారావు బహద్దరు, పాటిబండ సుబ్రహ్మణ్య, బొడ్డపాటి వెంకటప్పయ్య గార్లు అందించారు. 1913 నూతన గ్రంథాలయ భవనానికి అప్పటి మద్రాసు ప్రభుత్వ కార్యనిర్వాహక సభా సభ్యులుగానున్న సర్ వి. ఎస్. శివస్వామి అయ్యరు గారు శంఖుస్థాపన చేశారు. భవన ప్రవేశ మహోత్సవం [[పింగళి వెంకట్రామ రెడ్డి]] గారిచే జరుపబడింది. భవనానికి పై అంతస్థును కౌతా సూర్యనారాయణ గారు నిర్మించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రామమోహన_గ్రంథాలయం" నుండి వెలికితీశారు