గయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గయుడు''' ఒక గంధర్వుడు, మణిపురమునకు [[రాజు]].
 
ఒకనాడు [[శివుడు|శివు]]ని పూజించి తిరుగు ప్రయాణంలో ఆకాశ మార్గాన పోవుచుండగా క్రిందికి [[ఉమ్మి]] వేసెను. అది అర్ఘ్యమిస్తున్న [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] దోసిట పడినది. సూర్యభగవానుని ఆరాధిస్తున్న తనపై ఉమిసిన వానిని చంపుదునని [[ప్రతిజ్ఞ|శపథము]] చేసెను. ఆ పలుకులు [[ఆకాశవాణి]] వలన గయుడు విని [[బ్రహ్మ]], పరమశివులను శరణువేడగా వారు తిరస్కరించిరి. గయుడు తనకు మరణం తప్పదు అనుకొనుచున్న సమయంలో [[నారదుడు]] మార్గమున కలుసుకొని [[అర్జునుడు|అర్జునుని]] శరణు వేడమని చెప్పెను. గయుడు అర్జునుని వద్దకు వేగముగా పోయి శరణార్ధిని, కాపాడమని ప్రార్థించెను. అర్జునుడు అతనికి అభయమిచ్చెను. విషయము తెలిసిన తరువాత [[శ్రీ కృష్ణుడు|కృష్ణు]]ని పగవా\నినిపగవానిని తాను రక్షింపవలసి వచ్చినందులకు చాలా విచారించెను. కృష్ణుడు గయుని తనకు అప్పగించమని [[వర్తమానము]] పంపెను. శరణు వేడిన వానిని విడువనని అర్జునుడు జవాబు చెప్పెను. ఇరువైపుల వారు సంధి చేయుటకు ప్రయత్నించినా కూడా అది కుదరలేదు. చివరకు గయుని వలన కృష్ణార్జునులకు [[యుద్ధము]] వచ్చెను. వీరిరువురు ఘోరముగా పోరాడుచుండిరి. తుదకు [[దేవతలు]] వచ్చి వారి [[యుద్ధము]]ను మాన్పించిరి. గయుడు కృష్ణుని [[పాదము]]లపై పడి శరణు వేడగా అతడు మన్నించెను.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/గయుడు" నుండి వెలికితీశారు