ప్రహ్లాదుడు: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోషం సవరణ
ట్యాగు: 2017 source edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
 
==జననము==
హిరణ్య కశిపుడు రాక్షస రాజు. తన సోదరుడు [[హిరణ్యాక్షుడు]] [[శ్రీహరి]] చేతిలో వరాహరూపం ద్వారా మరణించినట్లు తెలుసుకొన్న [[హిరణ్యకశిపుడు]] [[శ్రీహరి]]ని మట్టుపెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని [[బ్రహ్మ]] కోసమై ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అతడిని ఏం వరం కావాలో కోరుకొమ్మని అంటాడు. దాంతో రాక్షస రాజు తనకు ఇంటగాని బయట గాని, భూమి మీద గాని, ఆకాశంలో గాని, రాత్రి గాని పగలు గాని, దేవ దానవ మనుషుల చేత గాని చంప బడకుండుటకు [[వరము]] కావాలని కోరుతాడు. [[బ్రహ్మవైవర్త పురాణము|బ్రహ్మ]] ఆ వరానిస్తాడు. అప్పటి నుండి హిరణ్య కశిపుడు తనకు తిరుగు లేదని, తనకు మరణము లేదని విర్ర వీగుతూ దేవతలను, [[ఋషులు|ఋషు]]లను అనేక విధముల బాదింప సాగెను. హిరణ్య కశిపుని బాధలను భరింప లేక దేవతలందరు శ్రీహరికి మొర పెట్టుకోగా విషయమును గ్రహించిన శ్రీ హరి వారికి అభయమిస్తాడు.
 
హిరణ్యకశిపుని భార్య లీలావతి. రాక్షసులకు దేవతలకు ఎల్లప్పుడు యుద్ధాలు జరుగు తుండేవి. రాక్షసుల శత్రువైన [[ఇంద్రుడు]] గర్భవతియైన హిరణ్య కశిపుని భార్యను ఎత్తుకొని వెళతాడు. ఆమె గర్బములోనున్న వాడిని చంపడానికి. ఇది చూచిన [[నారదుడు]] ఇంద్రున్ని వారించి ఆమె గర్భములో పుట్ట బోయే వాడు దేవతలకు మిత్రుడౌతాడని నచ్చజెప్పి ఆమెను తన ఆశ్రమములో సేద దీర్చుతాడు. [[నారదుడు]] ఆమెకు విష్ణు భక్తి మాటలు నేర్పి, ఆమె [[గర్భము|గర్భములో]] వున్న ప్రహ్లదునికి విష్ణు గీతములు బోధించి అతడిని విష్ణు భక్తునిగ తీర్చి దిద్ది అమెను, భర్థ హిరణ్య కశిపుని ఇంట విడిచి పెట్టెను. కొంతకాలానికి లీలావతి ప్రసవిస్తుంది.ఆ శిశువుకు ప్రహ్లాదుడని నామ కరణము చేస్తారు. తపస్సు ముగించి వచ్చిన హిరణ్యకశిపుడు తన భార్యను నారద ముని ఆశ్రమమునుండి తీసుకెళ్ళి, సమస్త లోకాలనూ జయించి దేవతలను బానిసలుగా చేసుకొంటాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రహ్లాదుడు" నుండి వెలికితీశారు