సువర్ణసుందరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
B.K.Viswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 18:
జయంతుణికి ఈ మూడు వస్తువులూ ఇవ్వడం చూసిన ఆకతాయిలు ముగ్గురూ అతడిని వెనుకపాటున కొట్టి చెరువు ఒడ్డున పడవేసి వస్తువులను తీసుకొనిపోతారు. తరువాత రాత్రికి అతడికి చెరువులోని నీటి వలన మెలకువ వస్తుంది. దానితో పాటు వాతావరణం హాయిగా మారి అక్కడకు ఆకాసం నుండి కొందరు దేవకన్యలు రావ్దం జరుగుతుంది. వారి మద్య కల సుమ్దరిని చూసిన జయంతుడు అమెను ప్రేమిస్తాడు. ఆమెను ఎలాగైనా పొందాలని వారు విడిచిన దేవతా వస్త్రాల వద్ద కల ఆమె వస్త్రాన్ని పట్టుకొని సృహలేనివాడిగా నటిస్తాడు. వారు తిరిగి వెళ్ళాలనుకొన్నపుడు ఆమె తన వస్త్రాన్ని తీసికొనదానికి వచ్చి అతడిని చూస్తుంది. అతడిని విడిచి చెలులతో వెళ్ళుటకు మనస్కరించక అక్కడె ఆగిపోతుంది. వారిద్దరూ గాంధర్యపద్దతిలో వివాహం చేసుకొంటారు. కొంతకాలం ఉన్నతరువాత ఆమె తను తిరిగి ఇంద్ర సభకు వెళ్ళలని చెప్పి అతడికి ఒక వేణువు ఇచ్చి దానిని వాయించినపుడు తాను వస్తానని చెప్పి వెళుతుంది.
సువర్ణసుందరి ఇంద్రుని సభనందు నాట్యం చేయుచున్నపుడు జయంతుడు వేణువు ఊదటం వలన ఆమె రాలేక సభలో నాట్యం చేయలేక పడిపోతుంది. ఆమెను పరిక్షీంచిన ఇంద్రుడు ఆమె గర్భవతి అని తెలుసుకొంటాడు. దేవసభ నియమాలను తప్పినందుకు ఆమె మానవకన్యగా మారిపోవాలని, ఆమె ఆమెను మరచిపోతాడని ఆమె భర్తను తాకిన మరుక్షణం అతడు శిలగా మారిపోతాడని శాపం ఇస్తాడు. మరుక్షణం ఆమె భూమిపై పడి అక్కడే ఒక బిడ్దను కంటుంది,
తరువాత ఆమెని చెరబట్టాలని వెంబడించిన ఒకని నుండి పారిపోతూ బిడ్దడిని పోగొట్టుకొంటుంది. ఆ సంధర్భంలో భర్త కనిపించినా అతడిని సమీపించుటకు భయపడుతుంది. ఆమె కొడుకు ఒక పసువుల కాపరి వద్ద పెరుగుతూ తన అమ్మానాన్నలనుగురించి అడుగుతాడు. అతడు చనిపోతూ అతని తలిదండ్రులను వెతకమని చెప్పి పోతాడు. బాలుడు వెతుకుతూ ఒక గుహలో కల పార్వతీపరమేశ్వరుల ప్రతిమల వద్ద సృహ కోల్పోతాడు. పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమై అతడిని లాలిస్తరు. తన తలిదండ్రుల గురించి అడిగిన అతడికి తామే అతని తలిదండ్రులమని చెపుతారు.
|