నర్తకి మాధురినిమాధురి (కాంచనమాల) ని ప్రేమించిన డాక్టర్ కృష్ణారావు (రామానుజాచారి) తన భార్య రాధ (కన్నాంబ) ను నిర్లక్ష్యం చేస్తాడు. తాగుడుకు బానిస అయిన కృష్ణారావుపై విశ్వేశ్వరరావు అనే వ్యక్తిని హత్య చేసినట్లు అభియోగం మోపబడుతుంది. సాంఘిక సంస్కరణ పట్ల శ్రద్ధ చూపే గోపీనాథ్ (నాగయ్య) రాధను చేరదీసి ఆదుకుంటాడు. మాధురితో గొడవపడిన సందర్భంగా రాధ మతిస్థిమితం కోల్పోతుంది. అతనిలోని వేశ్యాలోలత్వం వలన అతని డబ్బు దస్కం కోల్పోతాడు. దైవవశాత్తు భార్య నోములు ఫలించి మరణదండన తప్పుతుంది. భార్యాపిల్లలు కలుసుకోవడంతో కథ సుఖాంతమౌతుంది.