కొమ్మూరి వేణుగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొమ్మూరి వేణుగోపాలరావు''' (1935 - 2004) ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత. ఇతడు పెంకుటిల్లు నవలా రచయిత గా ప్రసిధ్ధుడు. ఇతడు బెంగాల్ రచయిత [[శరత్ చంద్ర]] ప్రభావానికి గురై తెలుగులో చాలా రచనలు చేశారు. ఇతడు "ఆంధ్రా శరత్" గా పిలవబడ్డాడు. ఇతడు సుమారు 50 పైగా [[నవల]]లు రచించారు. వీరి రచనలు ఎక్కువగా మధ్య తరగతి మనుషుల మనస్తత్వాలకు దగ్గరగా ఉంటాయి. వీనిలో ''హౌస్ సర్జన్'', ''హారతి'', ''వ్యక్తిత్వం లేని మనిషి'' నవలలోని పాత్రలు ఉదాహరణలుగా నిలుస్తాయి. వీరి [[ప్రేమ నక్షత్రం]] నవల సినిమాగా వచ్చింది. 1959లో ''గోరింటాకు'' సీరియల్ గా వచ్చి యువకుల్ని బాగా ఆకర్షించింది. వీరు [[ఆకాశవాణి]] కోసం ఎన్నో [[నాటిక]]లు రచించారు. ఇవి కాకుండా కొన్ని మంచి కథలు కూడా రచించారు. వాటిలో ''మర మనిషి'' కథను నేషనల్ బుక్ ట్రస్ట్ అన్ని భాషలలోకి అనువదించి ప్రచురించింది.
 
తెలుగులో గొలుసు నవల అనే కొత్త ప్రక్రియను పురాణం సుబ్రహ్మణ్య శర్మ, [[గొల్లపూడి మారుతీరావు]] గార్లతో కలిసి మొదలుపెట్టారు. దీనిని "ఇడియట్" అనే పేరుతో [[ఆంధ్ర జ్యోతి]] వారపత్రికలో 1968లో ధారావాహికగా ప్రచురించారు.