బెజవాడ రాజారత్నం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
==చలనచిత్రరంగ జీవితం==
దక్షిణ భారతదేశంలో నిర్మితమైన తొలి సినిమా [[సీతాకళ్యాణం (సినిమా)|సీతాకల్యాణం(1934)]]లో రాజరత్నం సీత. అంతవరకూ ఉత్తరదేశంలో నిర్మితమవుతూ వచ్చిన తెలుగు సినిమాలు- 'సీతా కల్యాణం'తో మద్రాసులో మొదలైనాయి. [[పినపాక వెంకటదాసుగారువెంకటదాసు]] గారు, వేల్‌ పిక్చర్స్‌ పేరుతో తడికెలతో స్టూడియో (ఆళ్వార్‌పేటలో) కట్టి 'సీతాకల్యాణం' తీశారు. చిత్రపు నరసింహారావు దర్శకుడు. కల్యాణి అనే ఆయన రాముడు. రాజరత్నానికి ఇది తొలి సినిమా.
 
మధ్యలో ఒకటి రెండు చిత్రాల్లో నటించినా, నాటకాల్లోనూ నటిస్తూ- [[మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)|మళ్లీ పెళ్లి(1939)]] చిత్రంలో నటించిన పాత్రకూ, పాడిన పాటలకీ ప్రశంసలు లభించాయి. రాజరత్నం ఇందులో రెండో నాయిక. ప్రధాన నాయిక కాంచనమాల. కొచ్చర్లకోట సత్యనారాయణ, రాజరత్నం జంట. ఆమె పాడిన 'చెలి కుంకుమమే, పావనమే', 'కోయిలరో, ఏదీ నీ ప్రేమగీతి', 'గోపాలుడే' పాటలు ఆ రోజుల్లో చాలా పాపులరు. కాంచనమాలతో కలిసి పాడిన 'ఆనందమేగా వాంఛనీయము' కూడా అందరూ పాడుకునేవారు. ఈ సినిమాతో రాజరత్నానికి మంచి పేరు వచ్చినా, నాటకాల్లో కూడా నటించేది. వై.వి.రావు అటు తర్వాత తీసిన [[విశ్వమోహిని]](1940)లో నటించిందామె. 'ఈ పూపొదరింటా' పాట జనరంజకమైంది. పెద్ద హిట్టయిన 'మళ్లీ పెళ్ళి' తర్వాత, అంతటి పెద్ద హిట్టూ బి.ఎన్‌.రెడ్డిగారి [[దేవత (1941 సినిమా)|దేవత(1941)]]. చిత్తూరు నాగయ్య సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట- 'రాదే చెలి నమ్మరాదే చెలి- మగవారినిలా నమ్మరాదే చెలీ' ఇప్పటికీ నాటితరం వారికి బాగా గుర్తు. అలాగే అందులో ఆమె 'నిజమో కాదో', 'ఎవరు మాకింక సాటి' పాటలు కూడా పాడింది. ఇంకో పాట కూడా అందరి నోటా వినిపించేది. అది 'జాగేలా వెరపేలా త్రాగుము రాగ సుధారసము'. ఈ పాటలన్నీ సముద్రాల రాఘవాచార్య రాశారు.
"https://te.wikipedia.org/wiki/బెజవాడ_రాజారత్నం" నుండి వెలికితీశారు