రామ రాయ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
మెలికెల తొలగింపు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''రామ రాయలు''' (''Rama Raya'') [[శ్రీ కృష్ణదేవ రాయలు]] అల్లుడు, గొప్ప వీరుడు, రాజకీయ చతురుడు, చాలా కాలం 16వ శతాబ్ది రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించినాడు. శ్రీ కృష్ణదేవరాయల అల్లుడైనందున ఈయనను అళియ రామరాయలు ([[కన్నడము]]లో ''అళియ'' అంటే అల్లుడు) అని కూడా వ్యవహరిస్తారు.
ఇతని కాలమున నలుగురు సుల్తానులు దక్కనును పరిపాలించేవారు
#[[బీజాపూరు]] సుల్తాను [[ఇబ్రహీం ఆదిల్షా]]
#[[అహ్మద్నగర్]] సుల్తాను [[బురహాన్ నిజాం షా]]
#[[గోల్కొండ]] సుల్తాను [[జంషీద్ కులీ కుతుబ్ షా]]
#[[బీదరు]] సుల్తాను [[అలీ బరీదు]]
వీరిలో వీరు కలహించుకుంటూ ఉండేవారు, దానిని అలుసుగా తీసుకొని '''రామరాయలు''' ఒకసారి ఒకరికి, మరొకసారి మరొకరికీ సహాయం చేస్తూ చక్కగా ధనం సంపాదించినాడు. చివరకు ఇదే ఇతని మరణానికి, విజయనగర సామ్రాజ్యం పతనానికి దారితీసినది.
*[[1543]]లో అహ్మద్నగర్, గోల్కొండ సుల్తానులతో కలసి బీజాపూరు సుల్తానుపైకి దండెత్తినాడు.
*[[1544]]లో అహ్మద్నగర్ రాజునకు సహకరించినాడు.
ఇతను సైన్యంన ముస్లింలను చాలా మందిని చేరుకున్నాడు.
[[గోల్కొండ]] నవాబు అయిన [[జంషీద్ కులీ కుతుబ్ షా]] చివరి తమ్ముడు అయిన [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]]కి ఏడు సంవత్సరములు ఆశ్రయమిచ్చి తరువాత జాగీరు కూడా ఇచ్చినాడు.
[[1551]] లో రామరాయలూ, అహ్మద్నగర్ సుల్తానూ బీజాపూరు పైకి దండయాత్ర చేసి [[రాయచూరు]], [[ముద్గల్లు]], కృష్ణా, తుంగ భద్రా నదుల మధ్య భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
[[1553]]లో ఏడు లక్షల ధనమును స్వీకరించి [[బీజాపూరు]] సుల్తానును అహ్మద్నగర్ సుల్తాను అయిన[[ హుసేన్ నిజాం షా]] నుండి కాపాడినాడు.
తరువాత [[1557]]లో బీజాపూరు సుల్తానునకు సహాయం చేసి [[హుసేన్ నిజాం షా]] తో యుద్దం చేసెను, ఈ దండయాత్రలో విజయనగర సైనికులు [[దౌలతాబాదు]] వరకూ గల విశాల భూభాగాలను జయించి అనేక [[మసీదు]]లనూ, [[ఖురాను]]లకూ అవమానం చేసినారు. దీనితో నలుగురు సుల్తానులూ ఒక్కటి అవ్వడానికి అవకాశం ఏరడినది. ఈ దుశ్చర్యలకు ముఖ్యముగా [[గోల్కొండ]] నవాబు [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]] బాధపడినాడు.
==తళ్ళికోట యుద్ధము==
{{seemain|తళ్ళికోట యుద్ధము}}
[[1564]] [[డిసెంబర్ 25]] న నలుగురు సుల్తానులూ ఏకమై తళ్ళికోట వద్ద యుద్దమునకు సిద్దమయినారు. [[1565]] [[జనవరి 23]] న జరిగిన తళ్ళికోట యుద్దములో రామ రాయలు శత్రువుల చేతిలో మరణించినాడు. దీనితో శతాబ్దాల విజయనగర వైభవం క్షిణించినది. కేవలం వీరి యుద్ద శిభిరాలనుండే కోటింపాతిక ధనమును పొందినారు, తరువాత విజయనగర ప్రజలు అడవులబట్టిపోయినారు, ఆరునెలలు నలుగురు సుల్తానులు విజయనగరంలోనే మకాం వేసి తరువాత వారిలో వారికి గొడవలు వచ్చి ఎవరి రాజ్యానికి వారు పొయినారు.
{{విజయ నగర రాజులు}}
{{క్రమము|
ముందరి = [[సదాశివ రాయలు]] |
జాబితా = [[విజయనగర సామ్రాజ్యము]] <br/> 1542 — 1565 |
తరువాతి = [[తిరుమల దేవ రాయలు]]
}}
<!-- categories -->
[[Category:భారత దేశ చరిత్ర]]
[[Category: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ]]
[[Category:విజయ నగర రాజులు]]
<!-- interwiki links -->
[[en:Aliya Rama Raya]]
|