విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
* [[1515]] ఎ.డి – [[ఆంధ్రభోజుడు]] [[శ్రీకృష్ణ దేవరాయలు]] విశాల సామ్రాజ్యంలో, విశాఖప్రాంతం ఒక భాగం. అతని పాలనా కాలంలో, [[సింహాచలాన్ని]] పలు మార్లు దర్శించి, [[పచ్చల పతకాన్ని]], మరికొన్ని నగలను బహూకరించినట్లు శాసనాలు ఉన్నాయి. ఈ [[పచ్చల పతకాన్ని]] [[గజ్జెల ప్రసాద్]] అనే [[స్టూవర్టుపురం]] గజదొంగ, దొంగతనం చేసాడు. దొంగ దొరికాడు. కానీ, పచ్చల పతకంలోని పచ్చలు కొంచెం విరిగాయి.
*[[1515]] లో [[రాయలు]], [[కొండవీడు]] ను ముట్టడించినాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉన్నది. ఇదే సమయంలో [[ప్రతాపరుద్ర గజపతి]], [[కృష్ణానది]] ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేశాడు. ఈ యుద్ధమున [[రాయలు]] విజయం సాధించాడు. తరువాత [[రాయలు]] [[కొండవీడు]] ను అరవై రోజులు పోరాడి [[1515 జూన్ 6]] న స్వాధీనం చేసుకున్నాడు. తరువాత, [[రాయలు]], [[మాడుగుల]], [[వడ్డాది]], [[సింహాచలము]] లను స్వాధీనం చేసుకొని [[సింహాచలం]] [[నరసింహ స్వామి]] ని పూజించి అనేక దాన ధర్మాలు చేసినాడు.
 
*[[1757]]: [[బొబ్బిలి యుద్ధం]] 23 జనవరి 1757 న [[ఫ్రెంచి]] జనరల్ [[బుస్సీ]] నాయకత్వంలో జరిగింది. అప్పటికి , [[ విశాఖపట్నం జిల్లా ]] ఏర్పడలేదు) . [[విజయనగరం]] రాజు గెలవటం వలన, [[ బొబ్బిలి]] సంస్థానం [[విజయనగరం]] సంస్థానంలో కలిసింది.
 
*[[1794]]: [[పద్మనాభయుద్ధం]] 10 జూలై 1794 నాడు [[విజయనగరం]] రాజు (చిన విజయ రామరాజు) కి, కల్నల్ పెండర్గస్ట్ (మద్రాసులోని బ్రిటిష్ గవర్నర్ జాన్ ఆండ్రూస్ తరపున) కి మధ్య జరిగింది. ఆంగ్లేయులు గెలిచిన కారణంగా, మొత్తం విజయనగరం సంస్థానం (బొబ్బిలి సంస్థానం తో కలిపి), ఆంగ్లేయుల పాలన లోకి వచ్చింది. అప్పటికి , [[ విశాఖపట్నం జిల్లా ]] ఏర్పడలేదు). కానీ, ఈ సంస్థానం అంతా , [[మద్రాసు ప్రెసిడెన్సీ]] పాలనలోనికి వచ్చింది అనుకోవాలి.
 
* [[18 వ శతాబ్దం]]లో విశాఖపట్నం [[ఉత్తర సర్కారులు|ఉత్తర సర్కారుల]]లో భాగంగా ఉండేది. [[కోస్తా ఆంధ్ర]] లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట [[ఫ్రెంచి వారు|ఫ్రెంచి]] వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత [[బ్రిటిషు వారు|బ్రిటిషు వారి]] అధీనంలోకి వెళ్ళాయి. [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లో విశాఖపట్నం ఒక జిల్లాగా ఉండేది.
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు