విశాఖపట్నం జిల్లా
విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలోని ఒక జిల్లా. దీని కేంద్రం విశాఖపట్నం. ఇది పూర్తిగా పట్టణ జిల్లా, విస్తీర్ణం పరంగా రాష్ట్రంలో అతి చిన్న జిల్లా. 2022 లో జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రాంతాలను అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలలో చేర్చారు.
విశాఖపట్నం జిల్లా | ||||||
---|---|---|---|---|---|---|
పై ఎడమనుండి సవ్యదిశలో: కైలాసగిరి నుండి విశాఖపట్నం దృశ్యం, వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం, బావికొండ స్తూపాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ స్మారక నిర్మాణం. | ||||||
![]() | ||||||
నిర్దేశాంకాలు: 17°43′20″N 83°17′25″E / 17.7221°N 83.2902°ECoordinates: 17°43′20″N 83°17′25″E / 17.7221°N 83.2902°E | ||||||
Country | భారతదేశం | |||||
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ | |||||
ప్రాంతం | ఉత్తరాంధ్ర | |||||
ప్రధాన కేంద్రం | విశాఖపట్నం | |||||
విస్తీర్ణం | ||||||
• మొత్తం | 1,048 km2 (405 sq mi) | |||||
జనాభా వివరాలు (2011)[1] | ||||||
• మొత్తం | 19,59,500 | |||||
• సాంద్రత | 1,900/km2 (4,800/sq mi) | |||||
భాష | ||||||
• అధికారక | తెలుగు | |||||
కాలమానం | UTC+5:30 (IST) | |||||
ప్రాంతీయ ఫోన్కోడ్ | +91 0( ) | |||||
జాలస్థలి | visakhapatnam |
ఈ జిల్లాలో బౌధ్ధమతం వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, తొట్లకొండ లో అవశేషాలు చూడవచ్చు. విశాఖపట్నం నగరంలో ప్రాచీనమైన సింహాచలం దేవాలయం, వలస పక్షులు వచ్చే కొండకర్ల ఆవ ఇతర ప్రముఖ పర్యాటక కేంద్రాలు. Map
ఉమ్మడి జిల్లా చరిత్రసవరించు
గోదావరి నది వరకు విస్తరించిన ప్రాచీన కళింగ సామ్రాజ్యంలో భాగమైన ఈ ఉమ్మడి జిల్లా ప్రాంతపు ప్రస్తావన సా.శ.పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంథాలలోను, సా.శ.పూ. 4 వ శతాబ్దికి చెందిన సంస్కృత వ్యాకరణ పండితులైన పాణిని, కాత్యాయనుని రచనలలోను ఉంది.
సా.శ. 260లో అశోక చక్రవర్తి పాలనలో కళింగదేశం ఉండేది. ఆ కళింగదేశంలో, అంతర్భాగంగా ఈ విశాఖపట్టణం ప్రాంతం అంతా ఉండేది. తెలుగు దేశాన్ని, త్రికళింగదేశం అనే (త్రిలింగదేశం) చరిత్ర కారులు చెబుతారు. ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: 7 వ శతాబ్దంలో కళింగులు, 8 వ శతాబ్దంలో వేంగి (ఆంధ్ర రాజులు) చాళుక్యులు, తరువాతి కాలంలో రాజమండ్రి రెడ్డి రాజులు, పల్లవ రాజులు, చోళులు, గంగ వంశం రాజులు గోల్కొండకు చెందిన కుతుబ్ షాహిలు, మొగలులు, హైదరాబాదు నవాబులు ఈ ప్రాంతాన్ని పాలించారు. 15వ శతాబ్దం నాటికి విజయనగర సామ్రాజ్యంలో అంతర్బాగమైంది.[2]
కోస్తా ఆంధ్ర లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, 18 వ శతాబ్దంలో బ్రిటిషు వారి వారి అధీనంలోకి వెళ్ళాయి. 1804 లో మద్రాసు ప్రెసిడెన్సీలో విశాఖపట్నం జిల్లాగా ఏర్పడింది. అల్లూరి సీతారామరాజు జరిపిన రంప పితూరీ, 1922 నుంచి 1924 వరకు రెండు సంవత్సరాలు జరిగింది. 1941 ఏప్రిల్ 6న జపాన్ వారి యుద్ధ విమానాలు విశాఖపట్టణం మీద బాంబులు వేసాయి అయితే ప్రాణనష్టం జరగలేదు.
1950 ఆగస్టు 15 న ఈ జిల్లాలో కొంత భాగం శ్రీకాకుళం జిల్లాగా ఏర్పడింది. మిగిలిన విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా ఏర్పడింది. 2022 లో జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, దీనిలోని కొన్ని ప్రాంతాలను అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలలో చేర్చారు.[1][3]
భౌగోళిక స్వరూపంసవరించు
జిల్లాకు ఉత్తరాన, తూర్పున విజయనగరం జిల్లా, దక్షిణాన బంగాళాఖాతము, పశ్చిమాన అనకాపల్లి జిల్లా వున్నాయి.
ప్రధాన నదులుసవరించు
రెవెన్యూ డివిజన్లు, మండలాలుసవరించు
జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత, జిల్లాను రెండు రెవిన్యూ డివిజన్లు, 11 మండలాలుగా విభజించారు.[4]
మండలాలుసవరించు
విశాఖపట్నం జిల్లా మండలాల పటం (2022లో ఏర్పడిన కొత్త మండలాల మాతృ మండలంతో) (Overpass-turbo) |
విశాఖపట్నం పట్టణ మండలాన్ని మహారాణిపేట, ములగాడ, గోపాలపట్నం, సీతమ్మధార మండలాలుగా 2022 లో జిల్లాల సవరణలో భాగంగా విభజించారు.
- భీమునిపట్నం రెవెన్యూ డివిజను
- విశాఖపట్నం రెవెన్యూ డివిజను
రాజకీయ విభాగాలుసవరించు
లోకసభ నియోజక వర్గాలుసవరించు
శాసనసభ నియోజకవర్గాలుసవరించు
- ఉత్తర విశాఖపట్నం
- గాజువాక
- తూర్పు విశాఖపట్నం
- దక్షిణ విశాఖపట్నం
- పశ్చిమ విశాఖపట్నం
- పెందుర్తి (పాక్షిక) (మిగతా భాగం అనకాపల్లి జిల్లాలో వుంది)
- భీమిలి
స్థానిక సంస్థలుసవరించు
మహా విశాఖ నగరపాలక సంస్థసవరించు
విశాఖపట్నం నగర అభివృద్ధి కోసం, 1962 నుంచి, టౌన్ ప్లానింగ్ ట్రస్టు (టి.పి.టి) ఉండేది. దీనిని 1978 జూన్ 17 నాడు విశాఖపట్నం అర్బన్ డవలప్మెంట్ అధారిటీ (VUDA (వుడా) గా, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ (డెవలప్ మెంట్) చట్టం 1975 ప్రకారం ఏర్పాటు చేసారు. నగర పాలన విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది.
విశాఖపట్టణం జిల్లా ప్రజా పరిషత్సవరించు
ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టం, 1920, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టం, 1955 ఆధారంగా ఏర్పడిన డిస్ట్రిక్ట్ బోర్డ్ (జిల్లా బోర్డ్ ) ఆనాడు జిల్లా పరిపాలన సాగించేవి. జిల్లా ప్రజా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తులు ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్తులు, జిల్లా అభివృద్ధి సమీక్ష మండలాల చట్టం 1968 (లేదా) 1986 కింద ఏర్పాటు చేయబడ్డాయి.
రవాణా వ్యవస్థసవరించు
చెన్నై-కోల్కతా లను కలుపు 16 వ నంబరు జాతీయ రహదారి, విశాఖపట్నం-రాయపూర్ లను కలుపు 26 వ నంబరు జాతీయ రహదారి జిల్లాను దేశం లోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానిస్తున్నాయి. హౌరా - చెన్నై రైలు మార్గంలో జిల్లా గుండా పోతుంది. నౌకాదళం అధీనంలో గల విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం, పౌర విమాన ప్రయాణసేవలకు కూడా ఉపయోగిస్తున్నారు. విశాఖపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్ ప్రముఖ జలరవాణా వసతులు.
విద్యా సౌకర్యాలుసవరించు
ఆంధ్రరాష్ట్రంలో తొలిగా ప్రారంభించినఆంధ్రవిశ్వ విద్యాలయంతో పాటు పలు ఇతర విశ్వవిద్యాలయాలు, వైద్య, సాంకేతిక, ఇతర కళాశాలలు, పరిశోధనా సంస్థలున్నాయి.
వైద్య సౌకర్యాలుసవరించు
అత్యాధునిక వైద్యసేవలు ప్రభుత్వ రంగం లోని కింగ్ జార్జి ఆసుపత్రి , విక్టోరియా హాస్పిటల్, విశాఖ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, పలు ప్రైవేటు వైద్య సంస్థల ద్వారా అందుబాటులోనున్నాయి.
పరిశ్రమలుసవరించు
సాధారణ పారిశ్రామిక వాడలేకాక ఔషధ రంగం, వస్త్ర రంగం, ఆర్ధిక రంగం కొరకు ప్రత్యేక పారిశ్రామిక వాడలు ఏర్పాటయినాయి.
సంస్థలుసవరించు
- లోహ పరిశ్రమ రంగం
- విశాఖపట్నం ఉక్కు కర్మాగారం: భారతదేశంలోని అత్యాధునికమైన ప్రభుత్వరంగ ఉక్కు తయారీదారు. దీనిని జర్మనీ, సోవియట్ రష్యాల సాంకేతిక సహకారంతో నిర్మించారు.
- ఐటి రంగం
ఐ.బీ.ఎమ్, టెక్ మహెంద్ర, హెచ్.ఎస్.బి.సి లాంటి పలు సంస్థలున్నాయి.[5]
- ఫార్మా రంగం
వైజాగ్ సమీపంలోని పరవాడ,పైడి భీమవరంలో ఫార్మా కంపెనీలు అభివృద్ధి చెందాయి. మైలన్, ఫైజర్,ఆవ్ర వంటి కంపెనీలున్నాయి.
ఇంకా ప్రభుత్వ రంగపు సంస్థలైన హిందుస్థాన్ జింక్ స్మెల్టర్, భారత్ హెవీ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, నావెల్ డాక్ యార్డ్, హిందుస్దాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి (చమురు శుద్ధి కర్మాగారం) ప్రవేట్ రంగంలో కోరమండల్ ఫెర్టిలైజర్సు ఇక్కడ వున్నాయి.
విద్యుత్ సరఫరా సేవలుసవరించు
'ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్' (ఈపీడీసీఎల్) సంస్థ పరిధిలో విశాఖపట్నం జిల్లాలోనే విద్యుత్ వాడకం ఎక్కువగా ఉంటుంది. భారీ పరిశ్రమలు, వాణిజ్య, గృహావసరాలకు అవసరమైన విద్యుత్ సరఫరాను ఈ సంస్థ సరఫరా చేయాలి. ప్రతి ఏడాది రోజువారీ పరిమితి (కోటా) 8 మిలియన్ యూనిట్ల నుంచి పది మిలియన్ యూనిట్ల వరకు ఉండేది. 2011కు ముందు సగటున రోజు వారి వినియోగం 8-10 మిలియన్ యూనిట్లు వుండగా 2011కు 11 మిలియన్ యూనిట్లకు పెరిగింది.
పర్యాటక ఆకర్షణలుసవరించు
ఈ జిల్లాలో బౌధ్ధమతం వర్ధిల్లింది. అందుకు గుర్తుగా తొట్లకొండ, బావికొండ పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. ఋషికొండ, రామకృష్ణ బీచ్, భీమునిపట్నం వంటి చక్కటి సముద్ర తీరాలు, కైలాసగిరి వంటి ఎత్తైన కొండల ప్రాంతాలు ప్రసిద్ధి చెందినవి. ప్రాచీనమైన సింహాచలం దేవాలయం, వలస పక్షులు వచ్చే కొండకర్ల ఆవ పర్యాటక కేంద్రాలు జిల్లాలో ఉన్నాయి.
పలు పర్యాటక స్థలాలు, పుణ్యక్షేత్రాలు, కయాకింగ్, స్కూబా డైవింగ్, ట్రెక్కింగ్, జెట్ స్కీయింగ్, పారా గ్లైడింగ్, హెలి పర్యాటకం వంటి సాహస క్రీడా సదుపాయాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో కోటి 78 లక్షల మంది పైచిలుకు, 2016లో రెండుకోట్ల 6 లక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా.[6] 2016, 2017 సంవత్సరాల్లో అత్యధిక పర్యాటకులు సందర్శించిన ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో విశాఖపట్టణం జిల్లా మూడవ స్థానంలో కొనసాగుతోంది. విదేశీ పర్యాటకులు అత్యధికులు సందర్శించిన జిల్లాల్లో 2016, 2017ల్లో రెండో స్థానం నిలబెట్టుకుంది.
చిత్రమాలికసవరించు
ఇవీ చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
- ↑ "విశాఖపట్నం జిల్లా జాలస్థలి". కలెక్టరు, విశాఖపట్నం జిల్లా. Archived from the original on 2019-11-05. Retrieved 2019-11-05.
- ↑ "కొత్త జిల్లా తాజా స్వరూపం". Eenadu.net. 31 March 2022. Retrieved 31 March 2022.
- ↑ DHS-2022, p. 4.
- ↑ "Visakhapatnam: జాబ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా వైజాగ్.. సిద్ధమవుతున్న భారీ క్యాంపస్." News 18. February 15, 2022.
- ↑ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఫుట్ఫాల్స్ సమాచారం (ఆర్కైవ్)
ఆధార గ్రంథాలుసవరించు
- DHS-2022. Visakhapatnam district - District handbook of statistics (PDF). Visakhapatnam district website, Government of AP. Retrieved 2022-05-12.