శ్రీపాద పినాకపాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
ఎం.డి. పూర్తి చేసిన పిమ్మట డా. శ్రీ పాద రాజమండ్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా ప్రభుత్వ సేవలో చేరారు..1951 నుండి 1954 వరకు విశాఖ పట్నం లో వైద్యకళాశాలలో సివిల్ సర్జన్ గా పని చేసారు.. 1957లో కర్నూల్ వైద్యకళాశాల కు బదిలీ అయ్యారు. అక్కడే కళాశాల ప్రిన్సిపాల్ గా, సూపరింటెండ్ గా పని చేసి 1968 లో పదవీ విరమణ చేసారు..
== రాగ సాధన ==
సంగీతం వింటూనే నొటోషన్స్్నొటోషన్స్ రాయగల నైపుణ్యం వీరి కుంది.. పదవీ విరమణానంతరం, త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలు, గీతాలు, స్వరజతులు, స్వరపల్లవులు, తాన పద వర్ణములు, కృతులు, పల్లవులు, జావళీలు మొదలైన సంగీత రచనలు ఏరికూర్చి, పుస్తకరచనకు శ్రీ కారం చుట్టారు..సంగీత సౌరభం పేరుతో తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రచురించిన నాలుగు సంపుటాలలో వీరు స్వర పరచిన అన్నమాచార్య కృతులు 108, త్యాగరాజాది వాగ్గేయ కారుల కృతులు 607, ముత్తు స్వామి దీక్షితుల కృతులు 173, పదములు 44, జావళీలు 40, తానవర్ణములు, 56, తిల్లనాలు, 10 మొత్తం 1088 సంగీత గుళికలు ఉన్నాయి..పాణినీయం, ప్రపత్తి, స్వరరామమ్, అభ్యాసమ్, నా సంగీత యాత్ర పుస్తకాలు రచించారు.
 
== శిష్యప్రముఖులు ==
డా.నోరి దత్తాత్రేయుడు వైద్యరంగంలో శ్రీ పాద వారి ప్రముశ శిష్యులలో ఒకరు కాగా, నూకల చిన సత్యనారాయణ, నేదునూరికృష్ణమూర్తి, శ్రీరంగం గోపాల రత్నం, మల్లాది సూరిబాబు, నేతి శ్రీరామశర్మ సంగీతం లో వారిశిష్యులు..
"https://te.wikipedia.org/wiki/శ్రీపాద_పినాకపాణి" నుండి వెలికితీశారు