సీమ కథలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 3:
''' సీమ కథలు '''-సింగమనేని నారాయణ సంకలనసారధ్యంలో వెలువడిన కథల సంపుటం.పద్దెనిమిదిమంది రాయలసీమ కవుల కలాలనుండి జాలువారిన కథలనుండి,ఆణిముత్యాలవంటి కథలను ఏరి,కూర్చి ప్రచురించిన కథల సంకలనం ఈపుస్తకము.తెలుగు కథా సాహిత్యానికి దాదాపు వందేళ్ల చరిత్ర వున్నది.పలు తెలుగుపత్రికలు కథలకు ప్రోత్యాహంయిస్తూ,ప్రచురిస్తున్నాయి.అయినప్పాటికి ప్రస్తుతం నవలలకే అగ్రతాంబులం అందుతున్నది.వారపత్రికలలోనవలలే సిరియల్లుగా వస్తున్నాయి.తెలుగునవలలనే ప్రచురణకర్తలు/పుస్తక ప్రకాశకులు ఎక్కువసంఖ్యలో అచ్చువేస్తున్నారు.అయితే అరవైదశకంలో ప్రముఖ కథారచయితల కథలను ప్రచురణకర్తలు సంకలానాలుగా అచ్చుచేశారు.ఆతురువాత వచ్చిన ప్రేమ,సైంటిఫిక్,క్షుద్రశక్తులు,థ్రిల్లరు,సస్పెన్సు నవలల ప్రచురణ ప్రభంజనంలో కథలపుస్తకాల ప్రచురణ కొద్దిగా మందగించిన మాట నిజం.అయితే ఈమధ్యకాలంలో పాఠకుల పఠనాభిరుచిలో మార్పు వచ్చినది.నిజాల్నిదాచి,అవాస్తవలోకాన్ని రంగుటద్దాలలో చూపించి,పాఠకులను అవాస్తవ భ్రమల ప్రపంచంలో విహరింప చేసే పైరకపు నవలల పైఆసక్తి తగ్గి,ఇప్పుడిప్పుడే జీవితంలోనిసంఘటనలను,వాస్తవాలను పలుకోణాలనుండి సృజిస్తూ,చుట్టూజరుగుతున్నఘోరాలను,అన్యాయలను,అక్రమాలను,కఠోర జీవిత, జీవననగ్నసత్యాలను,ఎత్తిచూపిస్తూ కళ్ళకుకట్టేటట్లు రాస్తున్నకథలను యిప్పుడు మక్కువగాచదువుచున్నారు.క్రమేపి కథాసంకలనపుస్తకాలకు ఆదరణపెరుగుతున్నది.ఈమార్పు హర్షించతగినదే.
సీమ కథలు పుస్తకాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,హైదరాబాదువారు మొదటిసారిగా1992లో ప్రచురించారు.మలిముద్రణ1994లో జరిగినది.ఆతువాత మూడవముద్రణ 2010లో.పుస్తకంలోని కథల సంకలనం:రాయలసీమరచయిత'సింగమనేని నారయణ'.ఇందులో మొత్తం పద్దెనిమిదికథలున్నాయి,పద్దెనిమిది రచయితలు తమఅనుభవాలను,వాస్తవ గ్రామీణుల యధార్దవ్యధలను,
అట్టిరాయలసీమ చిద్రమైన పల్లెజనుల బతుకులను పాఠకులముందుంచిన పుస్తకం-సీమ కథలు.
===మలిమాట===
|