బాల్యవివాహాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బాల్య వివాహము''' (Child Marriage) అనగా యుక్త వయసు రాక మునుపు అనగా బాల్య దశలో చేసే వివాహము. నేడు చట్ట ప్రకారము 18 సంవత్సరాల వయసు నిండని అమ్మాయికి, మరియు 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి జరిగే వివాహమును బాల్య వివాహముగా చెప్పవచ్చు. పూర్వము బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. దీనికి పెక్కు కారణములున్నవి.
'''బాల్య వివాహాలు''' :ఈ అనాగరిక దురాచారానికి [[పుత్తడిబొమ్మ పూర్ణమ్మ]] వంటి ఎందరో ముక్కుపచ్చలారని బాలలు బలైపోయారు.దీనికి మతపరంగాను, కులాల కట్టుబాట్ల కారణంగా మద్దతు లభిస్తూ వస్తోంది. పది సంవత్సరాలు కూడా నిండని పసిపిల్లలకు పూర్వం [[పెళ్ళి]] ల్లు చేసేవారు. పది సంవత్సరాలు నిండని [[కన్య]]ను నీ చేతుల్లో పెడుతున్నాననే పెళ్ళి మంత్రంతో [[కన్యాదానం]] జరుగుతుంది.భారత దేశంలో ఇంకాబాల్య వివాహాల దురాచారం కొనసాగుతూనే ఉంది. భారతీయ మహిళల్లో ఒకటింట అయిదో వంతు ఆడపిల్లలు పదిహేను సంవత్సరాలు నిండే లోపునే వివాహితలై పోతున్నారు. చట్టపరంగా నిర్ధారించిన వయసులోపునే పెళ్లిళ్లు చేసుకుంటున్న వారి సంఖ్య యాభయి శాతంగా ఉంది. అయిదోవంతు అమ్మాయిలకు పదిహేనేళ్ల వయసులోపు... యాభయి శాతంమందికి పద్ధెనిమిదేళ్ల లోపు.... మూడింట రెండువంతుల మందికి ఇరవై సంవత్సరాల లోపునే పెళ్లిళ్లయి పోతున్నాయి.(ఈనాడు 21.2.2010).ఈ ఏడాది ఉత్తమ మహిళగా గ్లామర్ మేగజైన్ పురస్కారాన్ని పొందిన యెమన్ దేశానికి చెందిన పదేళ్ళ బాల వధువు సుజూద్ అలీ. ఈ అమ్మాయి 8 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు పెళ్ళిచేశారు. కోర్టులో పోరాడి విడాకులు పొంది మళ్ళీ బడికి వెళుతోంది.
 
ఫ్రెంచివారు, పోర్చుగీసు వారు, డచ్ వారు, బ్రిటీషు వారు మొదలైన విదేశీయులు భారతదేశాన్ని పాలించు కాలంలో కొంతమంది విదేశీ అధికారులు భారతీయ [[కన్య]]లను బలవంతంగా వివాహమాడేవారు లేదా చెరచేవారు. వివాహితులను ఎత్తుకెళ్ళరని భావించిన భారతీయులు తమ పిల్లలకు బాల్యంలోనే వివాహం చేసేవారు. కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలను పటిష్టపరచుకోవడానికి ఆడపిల్ల పుట్టగానే తమ బంధువర్గంలో పలానావాడికి భార్య పుట్టిందని ఇరువర్గాలవారు నిర్ణయించేసుకొని పిల్లలు కొంచెం పెద్దవారవ్వగానే వివాహం చేసేవారు. మరియు ఆ కుటుంబాలలోని వృద్ధుల కోరిక మేరకు వారు చనిపోయేలోపు తమ వారసుల పెళ్ళిళ్ళు చూడాలనే కోరికను తీర్చడానికి కూడా బాల్యవివాహాలు జరిపించేవారు. మరికొన్ని కుటుంబాల్లో పిల్లలు యుక్తవయసు (Teenage) కు వచ్చిన తర్వాత వక్ర మార్గాల్లో ప్రయాణిస్తారనే భావనతో ముందు జాగ్రత్తగా బాల్యవివాహాలు జరిపించేవారు.
 
బాల్య వివాహం జరిపించినప్పటికీ అమ్మాయి యుక్త వయసుకు వచ్చిన తర్వాత మాత్రమే కాపురానికి పంపింఛేవారు. ఇలా చేయడం వల్ల అమ్మాయికి అబ్బాయికి ఒకరిపై ఒకరు ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి జీవితం గడపాల్సివచ్చేది. అయితే కొన్ని కుటుంబాల్లో అమ్మాయికి ఊహ తెలిసినా తెలియకపోయినా వయసులో ఎక్కువ తేడా ఉన్న వ్యక్తులతో కూడా ఈ వివాహాలు జరిపించేవారు. ఒక వేళ వయసులో ఎక్కువ తేడా వల్ల పురుషుడు ముందుగా చనిపోయినప్పటికీ పునర్వివాహాలు ఉండేవి కావు. అందువల్ల అమ్మాయి చిన్నవయసులోనే బాల వితంతువుగా మారి జీవితాంతం అలాగే ఉండాల్సివచ్చేది.
 
రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘసంస్కర్తల కృషి ఫలితంగా రాను రాను ప్రజల్లో బాల్యవివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెరిగి బాల్యవివాహాలను నిషేధించడం, పునర్వివాహాలను ప్రోత్సహించడం జరిగింది. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో అక్కడక్కడా అడపాదడపా ఇలాంటి బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.
 
==విశేషాలు==
*బ్రిటిష్ పాలకులు1929 లో చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెంక్ట్ యాక్ట్ తెచ్చారు.
"https://te.wikipedia.org/wiki/బాల్యవివాహాలు" నుండి వెలికితీశారు