ఎస్.పి.శైలజ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేటలో సాంప్రదాయ శైవ కుటుంబంలో జన్మించిన సుశీల తండ్రి సాంబమూర్తి ప్రముఖ హరికథా భాగవతారు. అన్న [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]] దక్షిణ భారత సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన నేపథ్యగాయకుడు. తండ్రి, అన్న కూడా ఈమెను బాగా చదివించాలని అనుకునేవారు.
 
1977లో బాలసుబ్రహ్మణ్యం ట్రూపు వారు విదేశాలలో ప్రదర్శనలివ్వడానికి వెళ్తున్నప్పుడు వారికి వీడ్కోలు ఇవ్వడానికి విమానాశ్రయాన్ని శైలజ కూడా వెల్లింది. అక్కడ విమానం ఆలస్యం కావడంతో కాలక్షేపానికి సినీ దర్శకుడు [[చక్రవర్తి]] సమక్షంలో సరదాగా పాటలు పాడింది. ఆ తర్వాత చక్రవర్తి గారు ఆమెను తొలిసారిగా మద్రాసు పిలిపించి [[మార్పు]] (1978) సినిమా కోసం పాట పాడించారు.<ref>మెలొడీలోనే ఉంది మజా! నేపథ్య గాయని శైలజతో ముఖాముఖి, ఈనాడు ఆదివారం, 28 డిసెంబరు 2008.</ref> ఈనాటి ప్రముఖ దర్శకుడు [[తేజ]] ఆ సినిమాలో చిన్న పిల్లవాడిగా నటించాడు.
 
ఈమె గాయనిగానే కాక సినిమాలలో టబూ, సోనాలీ బింద్రే మొదలైన వారికి తెలుగు సినిమాలలో డబ్బింగు చెప్పింది. శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమంలోని "వేదం అణువణువున నాదం" అన్న పాటలో శాస్త్రీయ నృత్య కళాకారిణిగా నటించింది.<ref>http://www.hindu.com/2007/11/19/stories/2007111959770600.htm</ref>
"https://te.wikipedia.org/wiki/ఎస్.పి.శైలజ" నుండి వెలికితీశారు