ఎస్.పి.శైలజ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
ఈమె మద్రాసులో [[భరతనాట్యం]] నేర్చుకొని అరంగేట్రం ఇస్తున్నప్పుడు, దానికి వచ్చిన [[కె.విశ్వనాథ్]] తాను తీస్తున్న [[సాగర సంగమం]] లో ఒక నాట్యం చేసే పాత్ర కోసం ఈమెను, కుటుంబసభ్యుల్ని ఒప్పించి మొదటిసారిగా నటింపజేశారు. అలా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమంలోని "వేదం అణువణువున నాదం" అన్న పాటలో శాస్త్రీయ నృత్య కళాకారిణిగా నటించింది.<ref>http://www.hindu.com/2007/11/19/stories/2007111959770600.htm</ref> ఇదే ఈమె నటించిన ఏకైన చిత్రం.
 
ఈమె సుమారు 70 సినిమాలలో చాలా మంది నటీమణులకు గాత్రదానం చేశారు. అందులో మొదటిది [[పట్నం వచ్చిన పతివ్రతలు]]. అందులో ఆమె [[రాధిక]] గారికి తన గొంతును వాడారు. ఈమె గాయనిగానే కాక సినిమాలలో టబూ, సోనాలీ బింద్రే మొదలైన వారికి తెలుగు సినిమాలలో డబ్బింగు చెప్పింది. ఆ తర్వాత [[వసంత కోకిల]] లో [[శ్రీదేశ్రీదేవి]]వి గారికి, నిన్నే పెళ్లాడుతా మరియు మురారి చితాలల్లో [[టబు]]కి కూడా ఈమే డబ్బింగ్ చెప్పింది.
 
ఈమె [[శుభలేఖ సుధాకర్]] ను పెళ్లి చేసుకున్నది. వీరికి ఒకే అబ్బాయి - శ్రీకర్.
"https://te.wikipedia.org/wiki/ఎస్.పి.శైలజ" నుండి వెలికితీశారు