రేమెళ్ళ అవధానులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{వికీకరణ}}
డాక్టర్ '''రేమెళ్ళ అవధానులు''' సెప్టెంబరు 25, 1948 తేదీన [[తూర్పు గోదావరి జిల్లా]] [[కోనసీమ]]లోని [[పొడగట్లపల్లి]] లో సూర్యనారాయణ, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించాడు.<ref>http://www.shrivedabharathi.org/RVSS_Resume_07082011.pdf</ref> 1969 లో పరమాణు భౌతిక శాస్త్రం లో ఎమ్మెస్సీ చేసాడు. [[రాజోలు]] డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర ఉపన్యాసకునిగా ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తూ ఖాళీ సమయాన్ని వృధా చేయక తనకిష్టమైన వేదాలను నేర్చుకోవాలనే అభిలాష కొద్దీ దగ్గరలో ఉన్న వేద పాఠశాలకు వెళ్ళి వేదాలను నేర్చుకునేవాడు. కానీ 1971 లో [[హైదరాబాదు]]లో [[ఇ.సి.ఐ.ఎల్]]. కంపెనీలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్ వచ్చేశాడు. ఇ.సి.ఐ.ఎల్. భారత దేశంలోనే మొట్టమొదటి కంప్యూటర్ల తయారీ కంపెనీ. ఆ కంపెనీలో శిక్షణలో భాగంగా కొన్ని పుస్తకాలు చదువుతుంటే, '' ఎ ప్లస్ బి హోల్ స్కేర్ '' అనే గణిత సమస్యకు సంబంధించిన చరిత్ర కనబడింది. దానిని మన భారతీయులు మూడు వేల ఏండ్ల క్రిందటే కనుగొన్నారని తెలిశాక, మన ప్రాచీన గ్రంథాలపై మరింత ఆసక్తి పెరిగింది, అవధానులు కి. ఇ.సి.ఐ.ఎల్. లో ఎనిమిదేండ్లు పనిచేసి, తిరిగి వేదాధ్యయనాన్ని కొనసాగించాడు. అంతరించిన పురాతన గ్రంథాలు అంతరించి పోగా మిగిలిన వాటినైనా రక్షించు కోవాలని అవధానులు కు ఆలోచన వచ్చింది. దాన్ని కార్య రూపంలోకి తేటానికి ప్రయత్నించాడు.
|