ఆది శంకరాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

కనకధారా_స్తోత్రం
పంక్తి 45:
 
===బాల్యము===
శంకరుని బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా [[ఉపనయనం]] జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే [[చతుర్వేదాలు|వేదవిద్యలు]], [[సంస్కృతం]] అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న [[ఉసిరి]] కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా [[కనకథారా స్తోత్రంకనకధారా_స్తోత్రం|కనకథారా స్తోత్రాన్ని]] చెప్పారు. కనకథారా స్తోత్రంతో పులకించిన [[లక్ష్మి|లక్ష్మీ దేవి]] బంగారు ఉసిరికాయలు వర్షింపజేస్తుంది.
 
ఒకరోజు శంకరుని తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.
"https://te.wikipedia.org/wiki/ఆది_శంకరాచార్యుడు" నుండి వెలికితీశారు