సికింద్రాబాద్ క్లాక్ టవర్

(సికింద్రాబాద్ క్లాక్‌ టవర్ నుండి దారిమార్పు చెందింది)

సికింద్రాబాద్ క్లాక్‌ టవర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు సమీపంలోని సికింద్రాబాదులో ఉన్న టవర్. బ్రిటీష్ కంటోన్మెంట్ ప్రగతికి చిహ్నంగా 1860లో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టవర్ 1897, ఫిబ్రవరి 1న ప్రారంభించబడింది.[2]

సికింద్రాబాద్ క్లాక్‌ టవర్
క్లాక్‌ టవర్
అక్షాంశ,రేఖాంశాలు17°26′27″N 78°29′55″E / 17.4408°N 78.4985°E / 17.4408; 78.4985
ప్రదేశంసికింద్రాబాదు, తెలంగాణ
రూపకర్తనిజాం
రకంవిక్టరి కాలమ్
ఎత్తు120 అడుగులు[1]
ప్రారంభ తేదీ1 ఫిబ్రవరి, 1897
అంకితం చేయబడినదిసికింద్రాబాద్ కంటోన్మెంట్ వద్ద ఉన్న బ్రిటీష్ అధికారులకు

చరిత్ర మార్చు

1806వ సంవత్సరంలో సైన్య సహకార ఒప్పందంలో భాగంగా హుస్సేన్ సాగర్ అవతల ఏర్పాటుచేయబడిన ఆంగ్లేయుల స్థావరం నిజాం పాలకుడు సికిందర్ జాహ్ ఉత్తర్వులతో సికింద్రాబాదుగా ఆవిర్బవించింది.[3] హైదరాబాదులోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ వద్ద ఉన్న బ్రిటీష్ అధికారులు సాధించిన పురోగతిని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం 1860లో 10 ఎకరాల (4.0 హెక్టారులు) భూమిని ఇచ్చింది.[4] 1896లో 2.5 ఎకరాల (1.0 హెక్టార్లు) పార్కులో 120 అడుగుల ఎత్తైన క్లాక్ టవర్ నిర్మించబడింది.[1] సర్ ట్రెవర్ జాన్ చిచెల్ ప్లోడెన్ 1897, ఫిబ్రవరి 1న ప్రారంభించారు. టవర్ మీద ఉన్న గడియారంను వ్యాపారవేత్త దివాన్ బహదూర్ సేఠ్ లక్ష్మీనారాయణ రాంగోపాల్ విరాళంగా ఇచ్చారు.[3]

వారసత్వ నిర్మాణం మార్చు

హైదరాబాద్-సికింద్రాబాద్ యొక్క జంట నగరాల్లో ఈ టవర్ వారసత్వ నిర్మాణంగా ప్రకటించబడింది.[4] పౌర సంస్థ చేపట్టిన ప్రయత్నాల ఫలితంగా యునెస్కో ఈ టవర్ కు వారసత్వ కట్టడంగా హోదా ఇచ్చింది.[5]

ఇతర వివరాలు మార్చు

  1. 1969లో మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమములో జరిగిన ఆందోళనలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఒక అమరవీరుని జ్ఞాపకార్థంగా ఒక స్మారక చిహ్నం కూడా ఈ పార్కులో స్థాపించబడింది.[6] కొంతకాలం తరువాత టవర్ యొక్క నాలుగు గడియారములు సాంకేతిక సమస్యలతో పనిచేయడం ఆగిపోయాయి.[4]
  2. పెరిగిన ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని 2003లో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఈ టవర్ ను కూల్చివేయాలని భావించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పౌర సంస్థకు చెందిన సీనియర్ అధికారి ఈ నిర్మాణాన్ని పడగొట్టవద్దని సూచించాడు.[7]
  3. పార్కులో పచ్చని గడ్డిని పరచి, ఫౌంటెను ఏర్పాటు చేయబడింది. 2005లో పునఃర్నిర్మాణం జరిగిన ఈ పార్కును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి 2006లో ప్రారంభించాడు.[1][8]
  4. 2006లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే సికింద్రాబాద్ యొక్క 200 సంవత్సరాల ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. ఆ ఉత్సవాల లోగోకు ఈ టవర్ ను ఉపయోగించారు.[9]

మూలాలు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. 1.0 1.1 1.2 "Clock Tower Park to open, finally". The Hindu. 27 February 2006. Archived from the original on 18 ఏప్రిల్ 2007. Retrieved 13 April 2019.
  2. క్లాక్‌ టవర్లు (సికింద్రాబాద్ క్లాక్‌ టవర్), ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 61
  3. 3.0 3.1 Nanisetti, Serish (3 June 2006). "The man, his mite and Secunderabad". The Hindu. Archived from the original on 29 September 2008. Retrieved 13 April 2019.
  4. 4.0 4.1 4.2 "Time stands still at Clock Tower". The Hindu. 13 February 2007. Archived from the original on 19 ఫిబ్రవరి 2007. Retrieved 13 April 2019.
  5. Khan, Mir Ayoob Ali (16 March 2007). "Heritage hope alive". The Times of India. Archived from the original on 3 నవంబరు 2012. Retrieved 13 April 2019.
  6. "Floral tributes to Telangana martyrs". The Hindu. 5 April 2010. Archived from the original on 9 ఏప్రిల్ 2010. Retrieved 13 April 2019.
  7. "Secunderabad clock tower on MCH demolition list". The Times of India. 7 February 2003. Retrieved 13 April 2019.
  8. "Renovated Clock Tower Park to be opened today". The Times of India. 26 February 2006. Archived from the original on 3 నవంబరు 2012. Retrieved 13 April 2019.
  9. "Towering logo for 'splendid' city". The Hindu. 23 May 2006. Archived from the original on 1 జూలై 2006. Retrieved 13 April 2019.