ఎన్ రంగస్వామి

10:18, 10 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

ఎన్ రంగస్వామి (జననం 1950 ఆగస్టు 4) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రి. గతంలో 2001 నుంచి 2008 వరకు భారత జాతీయ కాంగ్రెస్ నుండి , ఆ తర్వాత 2011 నుంచి 2016 వరకు తన సొంత పార్టీ అయిన ఆల్ ఇండియా ఎన్.ఆర్.కాంగ్రెస్ నుండి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. సొంత పార్టీని స్థాపించిన మూడు నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సాధించాడు.