బద్దం బాల్‌రెడ్డి

బద్దం బాల్‌రెడ్డి హైదరాబాదుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. విద్యార్థి దశలోనే ఉద్యమాలలో పనిచేసి, ఆ తర్వాత జనసంఘ్లో చేరాడు. 1977లో జనసంఘ్ నేతలతో పాటు జనతాపార్టీలో చేరాడు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగాడు. 1985 నుంచి 1994 వరకు 3 సార్లు కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యాడు. నియోజకవర్గ ప్రజలచే కార్వాన్ టైగర్‌గా పిలుపించుకున్నాడు. 1991, 1998, 1999లలో హైదరాబాదు లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓడిపోయాడు.[1]

  • కార్వాన్‌ అసెంబ్లీ స్థానం నుంచి 1985లో కార్వాన్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 9,777 ఓట్ల మెజారిటీతో విరాసత్‌ రసూల్‌ఖాన్‌పై, 1989లో 3,066 ఓట్ల మెజా రిటీతో ఆకర్‌ ఆగాపై, 1994లో 13,293 ఓట్ల మెజా రిటీతో సయ్యద్‌ సజ్జాద్‌పై విజయం సాధించి శాసనసభ్యుడిగా హ్యాట్రిక్‌ విజయాలు సాధించాడు. ఆయన 1991,1998, 1999లో హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా, 1999, 2004, 2009, 2014 కార్వాన్‌ నుంచి ఎమ్మెల్యేగా, 2018లో రాజేంద్రనగర్‌ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు.[2]
బద్దం బాల్‌రెడ్డి
బద్దం బాల్‌రెడ్డి


3 సార్లు శాసన సభ్యులు
నియోజకవర్గం కార్వాన్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 7 మార్చి 1945
అలియాబాద్‌, హైదరాబాదు
మరణం 23 ఫిబ్రవరి 2019
బంజారాహిల్స్‌
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి యాదమ్మ
సంతానం అరుణ, గోపాల్‌రెడ్డి, శివపాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి
నివాసం బంజారాహిల్స్‌

కాబా సంఘటన మార్చు

1979లో బద్దం బాల్‌రెడ్డి ఇంటికి వెళ్ళుచుండగా శాలిబండవద్ద కొందరు దుండగులు కత్తులు, రాళ్ళతో దాడిచేసి చనిపోయాడని భావించి వదిలివెళ్ళారు.స్థానికులు గుర్తించి అతనిని రక్షించారు.

మరణం మార్చు

బద్దం బాల్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019 ఫిబ్రవరి 23న మరణించాడు.[3]

మూలాలు మార్చు

  1. Sakshi (31 October 2023). "పాతబస్తీలో హ్యాట్రిక్‌ వీరుడు". Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
  2. Sakshi (24 February 2019). "నగరంపై చెరగని తిలకం". Archived from the original on 15 December 2021. Retrieved 15 December 2021.
  3. Sakshi (24 February 2019). "బద్దం బాల్‌రెడ్డి కన్నుమూత". Archived from the original on 15 December 2021. Retrieved 15 December 2021.