బి. వి. మోహన్ రెడ్డి

బైరెడ్డి విష్ణు మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేశాడు.

బి.వి. మోహన్ రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 - 2004
నియోజకవర్గం ఎమ్మిగనూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1947
ఉలిందకొండ, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి నాగమణి
సంతానం బి. జయనాగేశ్వర రెడ్డి

జననం, విద్యాభాస్యం మార్చు

బి.వి. మోహన్ రెడ్డి 1947లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, ఉలిందకొండలో జన్మించాడు. ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం మార్చు

బి.వి. మోహన్ రెడ్డి 1985-1999 వరకు ఆయన వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.

సంవత్సరం నియోజకవర్గం పేరు విజేత పేరు పార్టీ సమీప ప్రత్యర్థి పార్టీ
2012 ఉప ఎన్నిక ఎమ్మిగనూరు కె. చెన్నకేశవ రెడ్డి వైసీపీ బి.వి. మోహన్ రెడ్డి తె.దే.పా
2009 ఎమ్మిగనూరు కె. చెన్నకేశవ రెడ్డి కాంగ్రెస్ బి.వి. మోహన్ రెడ్డి తె.దే.పా
2004 ఎమ్మిగనూరు కె. చెన్నకేశవ రెడ్డి కాంగ్రెస్ బి.వి. మోహన్ రెడ్డి తె.దే.పా
1999 ఎమ్మిగనూరు బి.వి. మోహన్ రెడ్డి తె.దే.పా కె. చెన్నకేశవ రెడ్డి కాంగ్రెస్
1994 ఎమ్మిగనూరు బి.వి. మోహన్ రెడ్డి తె.దే.పా కె. చెన్నకేశవ రెడ్డి కాంగ్రెస్
1989 ఎమ్మిగనూరు బి.వి. మోహన్ రెడ్డి తె.దే.పా ఏం.ఎస్. శివన్న కాంగ్రెస్
1985 ఎమ్మిగనూరు బి.వి. మోహన్ రెడ్డి తె.దే.పా దేవేంద్ర గౌడ్ కాంగ్రెస్

మరణం మార్చు

బి.వి. మోహన్ రెడ్డి కాలేయ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 27 జూన్ 2012న మరణించాడు.[1]

మూలాలు మార్చు

  1. NDTV (27 June 2012). "Former Andhra Pradesh minister BV Mohan Reddy dead". Archived from the original on 25 జనవరి 2022. Retrieved 25 January 2022.