బెల్లంకొండ సురేష్

బెల్లంకొండ సురేష్ ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు పొందారు.

బెల్లంకొండ సురేష్ రెడ్డి
జననం (1965-12-05) 1965 డిసెంబరు 5 (వయసు 57)
వృత్తిచలనచిత్ర నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం
జీవిత భాగస్వామిబెల్లంకొండ పద్మావతి
పిల్లలుబెల్లంకొండ శ్రీనివాస్
బెల్లంకొండ గణేష్ బాబు

జీవిత చరిత్రసవరించు

బెల్లంకొండ సురేష్ సతీమణి పద్మావతి. వీరికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ బాబు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్ 2014లో అల్లుడు శీనుతో అరంగేట్రం చేశాడు. ఈ చిత్రం విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ఆయన రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాత. కాగా 2022లో స్వాతిముత్యం సినిమాతో ఆయన హీరోగా పరిచయం కాబోతోన్నాడు.

వివాదంసవరించు

టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాదు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో 2004 జూన్ 3న జరిగిన కాల్పుల ఘటనలో ఉన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్, అతని అసోసియేట్ సత్యనారాయణ చౌదరిపై నటుడు కాల్పులు జరిపాడు. అనంతరం క్షతగాత్రులిద్దరినీ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.[1] ఈ కేసు విచారణ, దానిని హ్యూమన్ రైట్స్ ఫోరమ్ ప్రశ్నించడం లాంటివి అప్పట్లో చాలా వివాదానికి దారితీశాయి.[2]

మూలాలుసవరించు

  1. "Actor 'fires at' producer". The Hindu. Chennai, India. 4 June 2004. Archived from the original on 13 August 2004. Retrieved 4 June 2004.
  2. "Delay in action against Balakrishna deplored". The Hindu. Archived from the original on 25 June 2008. Retrieved 19 June 2004.{{cite web}}: CS1 maint: unfit URL (link)