బొద్దులూరి నారాయణరావు

తెలుగు కవి

బొద్దులూరి నారాయణరావు తెలుగు కవి, పండితుడు.[1]

కర్షకకవి బొద్దులూరి నారాయణరావు.

జీవిత విశేషాలు మార్చు

వల్లభరావుపాలెం గ్రామానికి చెందిన అతను 1925లో జన్మించాడు. గ్రామంలో వ్యవసాయం చేస్తూనే విద్యనభ్యసించాడు. అతను హిందీ రాష్ట్ర భాషా ప్రచారక్‌ చదివి ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో బంగారు పతకాన్ని సాధించాడు. పొన్నూరు లోని సాక్షి భవనారాయణస్వామి సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చదివి బంగారు పతకాన్ని పొందాడు. కొంతకాలం హిందీ పండితునిగా, మూడు దశాబ్దాల పాటు తెలుగు పండితునిగా వివిధ విద్యాసంస్థలలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. [2]

పద్య కావ్యాలు మార్చు

  • శాంతిపథం[3]
  • రాధేయుడు
  • కవిత కాదంబిని
  • పాంచజన్యం

అతను రచించిన శాంతిపథం పుస్తకం భాషా ప్రవీణ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా నిర్ణయించారు[4].

అస్తమయం మార్చు

అతను 2019 మే 21న మరణించాడు.

మూలాలు మార్చు

  1. "మనమే అమ్ముడుపోతున్నాం!". Archived from the original on 2019-08-14. Retrieved 2019-08-14.
  2. "ప్రముఖ కవి బొద్దులూరి కన్నుమూత". Archived from the original on 2019-08-14. Retrieved 2019-08-14.
  3. "సాహిత్స ప్రస్థానం మాస పత్రిక, ఆగస్టు 2012, పుట 9" (PDF).[permanent dead link]
  4. "ప్రముఖ కవి బొద్దులూరి కన్నుమూత".[permanent dead link]