బొప్పూడి కృష్ణ మోహన్

బొప్పూడి కృష్ణ మోహన్‌ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నాడు.[1]

బొప్పూడి కృష్ణ మోహన్
బొప్పూడి కృష్ణ మోహన్


పదవీ కాలం
02 మే 2020 – ప్రస్తుతం
సూచించిన వారు శరద్ అరవింద్ బాబ్డే
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 5 ఫిబ్రవరి 1965
బొప్పూడి గ్రామం, చిలకలూరిపేట మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
తల్లిదండ్రులు బీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సావిత్రి
జీవిత భాగస్వామి బి. వసంత లక్ష్మి
పూర్వ విద్యార్థి ఆంధ్రా క్రిస్టియన్‌ కాలేజీ

జననం, విద్యాభాస్యం మార్చు

బి. కృష్ణ మోహన్ 1965 ఫిబ్రవరి 5లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, చిలకలూరిపేట మండలం, బొప్పూడి గ్రామంలో బీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సావిత్రి దంపతులకు జన్మించాడు. ఆయన గుంటూరులో మాజేటి గురువయ్య హైస్కూల్ పదవతరగతి వరకు, హిందూ కాలేజీలో డిగ్రీ, 1988లో ఆంధ్రా క్రిస్టియన్‌ కాలేజీ నుంచి ఎల్.ఎల్.బి పూర్తి చేసి బార్‌ కౌన్సిల్‌లో 1989 మార్చి 30లో పేరు నమోదు చేసుకున్నాడు.[2]

వృత్తి జీవితం మార్చు

బి. కృష్ణ మోహన్ గుంటూరు జిల్లా కోర్టులో 1989లో న్యాయవాదిగా కొంతకాలం ప్రాక్టీస్‌ చేసి సీనియర్‌ న్యాయవాది కృష్ణ కిషోర్‌ వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకొని హైకోర్టులో సీనియర్‌ న్యాయవాది త్రివిక్రమరావు వద్ద జూనియర్‌గా చేరాడు. ఆయన 1994లో సొంతంగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టి అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌గా 1996 నుండి 1999 వరకు పనిచేశాడు.

బి. కృష్ణ మోహన్ కేంద్ర ప్రభుత్వ కౌన్సిల్‌గా 2008 నుండి 2018 వరకు పనిచేసి 2019 జనవరి 10లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులయ్యాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడై 2020 ఏప్రిల్ 21న నియమితుడై, 2020 మే 02న బాధ్యతలు చేపట్టాడు.[3]

మూలాలు మార్చు

  1. The Hindu (2 May 2020). "Three sworn in as High Court judges" (in Indian English). Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.
  2. Sakshi (21 April 2020). "హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు". Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.
  3. The New Indian Express (3 May 2020). "3 sworn in as HC judges". Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.