బొల్లి
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
బొల్లి లేదా బొల్లి మచ్చలు (Vitiligo) ఒక రకమైన చర్మ వ్యాధి.
- బొల్లి అనేది తన స్వంత కణజాలము మీద ప్రతి ఘాతము చేసే వ్యాధి.
- బొల్లి చర్మం లోని మెలనిన్ కణాలు మృతి చెందడం వల్ల కాని, చర్మానికి హాని జరగడం వల్ల కాని వస్తుంది.
- బొల్లి వల్ల చర్మం మీద తెల్లటి మచ్చలు ఏర్పడుతాయి.
m:en:ICD-10 | {{{m:en:ICD10}}} |
---|---|
m:en:ICD-9 | {{{m:en:ICD9}}} |
m:en:OMIM | {{{m:en:OMIM}}} |
DiseasesDB | 13965 |
m:en:MedlinePlus | 000831 |
m:en:eMedicine | {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} |
MeSH | {{{m:en:MeshID}}} |
తెల్ల మచ్చలు (Depigmentation) మానవులలో ల్యూకోడెర్మా లేదా విటిలిగో వ్యాధుల వలన ఏర్పడతాయి.ఆయుర్వేద పరిభాషలో శ్విత్రం అని పిలిచే ఈ తెల్ల మచ్చల వ్యాధిని ఆధునిక వైద్యులు ల్యూకోడర్మాగానూ విటిలిగో గానూ పిలుస్తారు. ఇది శరీర అంత ర్భాగాల్లో ఏమాత్రం దుష్ప్రభావం చూపకుండా కేవలం చర్మం మీదే వ్యాపించే వ్యాధి. ఇది మెలినోసైడ్స్లో ఏర్పడిన కొన్నిలోపాల వల్ల ఏర్పడే సమస్య. మెలినోసైడ్స్ దెబ్బ తినడం వల్ల చర్మానికి ప్రాణమైన మెలినిన్ తయారు కాదు. దాని ఫలితమే తెల్ల మచ్చలు లేదా ల్యూకోడెర్మా/ విటిలిగో సమస్య.
వ్యాధి ప్రారంభముసవరించు
తెల్ల మచ్చల వ్యాధిని విటిలిగో ల్యూకోడర్మా, అని రెండు వేరు వేరు పేర్లతో పిలవడంలో వేరు వేరు కారణాలు కనిపిస్తాయి. విటిలిగో అన్నది శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు. ల్యూకోడర్మా మాత్రం కొన్ని అరుదైన ప్రదేశాల్లో మాత్రమే అంటే పెదాలుచ, జన,నాంగాలు, అరిచేతులు, అరిపాదాలు ఇలా చర్మం బాగా పలుచగా ఉండే ప్రదేశాల్లో మాత్రమే వస్తుంది. వాత, పిత్త, క ఫ దోషాల పాత్రలే ఈ వ్యాధికి మూలం. సాధారణంగా శరీరంలో కొన్ని అరుదైన ప్రదేశాల్లో మాత్రమే ఉండే ఈ మచ్చలు ఒక్కోపారి శరీరం మొత్తం వ్యాపించే ప్రమాదమైతే ఉంది. చాలా మందికి ఎక్కువ కాలమే పట్టినా కొందరిలో కేవలం ఏడాది కాలంలోనే ఈ వ్యాధి శరీరంలోని అన్ని భాగాలకూ పాకవచ్చు.
వ్యాధి వ్యాప్తి కారణాలుసవరించు
తెల్లమచ్చల వ్యాధి చర్మానికే పరిమితమైన వ్యాధే అయినా చర్మంలోనే మూడు విభాగాలు ఉంటాయి. అవి ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్. ఎపిడెర్మిస్ను పరిశీలిస్తే, వాటిలో కెరటోసైట్స్, మెలనో సైట్స్, లాంగర్హాండ్స్ అనే వివిధ కణజాలం ఉంటుంది. మెలనోసైట్స్ అనేవి సహజంగా మెలినిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. అయితే కొందరిలో ఈ ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. దీనికి కారణాలు అనేకం. చర్మానికి అవసరమైన వర్ణాన్ని, వెలుగునూ ఇచ్చేది పిత్తం ప్రత్యేకించి భ్రాజక పిత్తం ఈ పాత్రను నిర్వహిస్తుంది. భ్రాజకం అంటేనే ప్రకాశం. చర్మానికి అది అందించే అంశం కూడా అదే. ఎప్పుడైతే భ్రాజక పిత్తంలోనే లోపం ఏర్పడుతుందో అది తెల్లమచ్చల వ్యాధి మొదలవుతుంది. శ్విత్రం వ్యాధిలో వచ్చే మచ్చలు అందరిలోనూ తెలుపు రంగులోనే ఉంటాయని కూడా కాదు. కొందరిలో ఇవి ఎరుపు రంగులోనూ ఉండవచ్చు. శరీరంలో సహజంగా ఉండే టైరోసిన్ అనే ఒక ఎంజైము ఇది మెలినోసైట్స్ను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. టైరోసిన్లో లోపాలు ఏర్పడి ఎప్పుడైతే మెలనోసైట్స్ వృద్ధి పూర్తిగా ఆగిపోతుందో అప్పుడే తెల్ల మచ్చలు వస్తాయి. లోపం చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఎర్రటి మచ్చలు, సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు తెల్ల మచ్చలు ఏర్పడతాయి.