భారత దేశ విద్యా వ్యవస్థ - చరిత్ర


చదువు అనేది చాలా ముఖ్యమైనది.ఓ సంఘం యొక్క అభివృద్ధి అందులోని ప్రజల విద్యా వివేకాలపై ఆధారపడి ఉంటుంది. విద్య వెలుగునిస్తుంది. దీనిని భారతీయ సమాజం ఆదినుండి గుర్తించినది, తొలినాళ్ళనుండి విద్యకు చక్కని ప్రాముఖ్యత ఉన్నది, ఈ వ్యాసంలో మనము వివిధ కాలములలో, వివిధ రాజుల వద్ద భారతదేశంలో విద్యావ్యవస్థ ఎలా ఉన్నదో పరిశీలించుదాము. ( మూస:భారత దేశ విద్యా వ్యవస్థ - చరిత్ర)

వైదిక యుగంలో విద్యావ్యవస్థ మార్చు

పురాతన కాలంలో విద్యను మనిషి మూడవ కన్నుగా భావించారు. జ్ఞానానికి మార్గముగా ఈ చదువును భావించారు. ఆనాటి విద్య యొక్క చివరి లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం, కానీ తక్షణ గమ్యం మాత్రం తమ అభిరుచులకు, శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా ఉపాదిపొంది సమాజానికి తమ వంతు సహాయం చేయడం.విద్య జీవితానికి వెలుగునిస్తుందని, అది లేనివాడు గుడ్డివానితో సమానమని భావించేవాళ్ళు. విద్యను వారు చాలా గౌరవంగా భావించారు.వారి మాటల్లోనే చెప్పాలంటే "స్త్రీపురుషులకు విద్య చాలా ముఖ్యమైనది, అది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, తల్లిలాగా పోషిస్తుంది, తండ్రిలా మార్గదర్శిలా నిలుస్తుంది, భార్యలాగా సుఖసౌఖ్యాలను ప్రసాదిస్తుంది, కీర్తిని సంపాదిస్తుంది,కష్టాలు తొలిగిస్తుంది,స్వచ్చమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది, నాగరికునిగా మారుస్తుంది, పొరుగుదేశంలో ప్రయాణిస్తుంటే మంచి తోడుగా నిలుస్తుంది.కనుకనే దానిని కల్పవృక్షంగా భావిస్తారు".

ఉపనిషత్తుల కాలంలో విద్యావ్యవస్థ మార్చు

ఇక్కడ కూడా పరిస్థితి పూర్వంలాగానే ఉండినది, కాకపోతే కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి, పాఠ్యాంశములు పెరిగినాయి, వైశ్యులు, శూద్రుల విద్య గురించిన సమాచారము లేదు, విద్య పూర్తిగా మతపరమైనదిగానే సాగినది.దీనిని మనం క్రీస్తు పూర్వం 1400 నుండి క్రీస్తు పూర్వం 600 వరకూ గల కాలముగా చెప్పుకొనవచ్చు.

ఈ కాలంలోనే బ్రాహ్మణములు, ఆర్యణకములు, ఉపనిషత్తులు వృద్ధిచేయబడినాయి.

లక్ష్యం ఆత్మ సాక్షాత్కారము
గురువుల స్థానం చాలా ఉన్నత స్థితిలో ఉండేది
బోధనా పద్ధతులు శ్రవణం, మననం, నిధిధ్యాస (అనుభవం)
కులములు బ్రాహ్మణులు, క్షత్రియుల గురించి వివరములు కలవు, మిగిలిన రెండు కులముల గురించి వివరములు తెలీదు
స్త్రీ విద్య కొంత మంది స్త్రీ గురువులు గురించిన సమాచారం కలదు

బౌద్ద మతం వర్థిల్లిన కాలంలో విద్యావ్యవస్థ మార్చు

బౌద్దమతము వచ్చిన తరువాత విద్యావ్యవస్థలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.విద్య గురుకులాలనుండి ఆరామాలకు చేరుకున్నది, అనగా గురుకులాల్లో అయితే కేవలం ఒకే ఒక గురువు ఉంటాడు.అతనికి ఇద్దరు ముగ్గురు ప్రధాన శిష్యులు సహాయంగా ఉండేవారు.కానీ బౌద్ద ఆరామాలలో చాలా మంది గురువులు ఉండి ఇప్పటి మన విశ్వవిద్యాలయాలలాగా బోధన ఉండేది.ఇప్పుడే ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు అయిన నలందా విశ్వవిద్యాలయం, తక్షశిల విశ్వవిద్యాలయంలు వచ్చినాయి.ఈ కాలంలో మరో రెండు ముఖ్యమైన మార్పులు విద్యాబోధన సంస్కృతమునుండి ప్రజాభాషకు వచ్చినది, అయినప్పటికీ సంస్కృతమునకు తగినంత ప్రాముఖ్యత మాత్రం ఉండినది, మరొక మార్పు వేదాలకు ప్రధాన గౌరవం లేకుండా పొయినది, మొదటిసారిగా!

ముస్లిం పరిపాలకుల ప్రాంతాలలో విద్యావ్యవస్థ మార్చు

హిందూ పరిపాలకుల ప్రాంతాలలో విద్యావ్యవస్థ మార్చు

బ్రిటీషువారి ప్రాంతాలలో విద్యావ్యవస్థ మార్చు

బ్రిటీషు వారి కాలంలో భారత దేశ విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి.ముఖ్యముగా రెండు మార్పులు చెప్పుకోవాలి: ఒకటి అప్పటివరకూ ఎన్ని మార్పులు జరిగినా భారతదేశంలో విద్యావ్యవస్థ మతప్రధానమైనదిగానే ఉండినది, అయితే హిందూ మతము, లేదా బౌద్ద మతము లేదా ముస్లిం మతము, కానీ బ్రిటీషు వారు వచ్చిన తరువాత భౌతిక విద్యకు ప్రాధాన్యం పెరిగినది, వేదాలు చదవడం మానేసి ప్రజలు సైన్సు మొదలగున్నవి చదవడం మొదలుపెట్టినారు. ఇహ రెండవ ముఖ్యమైన మార్పు ఇంగ్లీషు భాషలో విద్యాబోధన, అప్పటివరకు వివిధ భారతీయ భాషలలో ముఖ్యముగా సంస్కృతములో లేదా అరబిక్ లేదా ఉర్దూ లలో జరిగే విద్యా బోధన ఇంగ్లీషుభాషలోనికి మార్చబడినది, అంటే మొత్తం మార్చబడినది అని కాదు, కానీ పరిపాలకుల ఆర్థిక సహాయం కేవలం ఇంగ్లీషు బోధించు పాఠశాలకే ఇవ్వసాగినారు, దానితో ఇంగ్లీషునకు ప్రాముఖ్యత పెరిగింది.

బ్రిటీషు వారి విద్యావిధానంలో ఎన్నో కమిటీలు వేసినారు, ఎన్నో సంస్కరణలు తేప్రయత్నించారు, కానీ వారు భారత దేశాన్ని వదిలే సమయానికి దేశంలో అక్షరాస్యత పది శాతం కూడాలేదు.దీనికి కారణం వారు పాటించిన జల్లెడ పద్ధతి లేదా ఫిల్టరు పద్ధతి.దీని ద్వారా కేవలం పై తరగతి వారికి చదువు చెప్తితే వారు క్రింది తరగతి వారికి నేర్పుతారు అని భావించడం జరిగింది.కానీ అది ఆచరణలో పెద్ద ఫెయిల్యూరుగా మిగిలినది।

సంస్థానాలలో విద్యావ్యవస్థ మార్చు

నిజాం సంస్థానంలో విద్యావ్యవస్థ మార్చు

నిజాం కాలంలోని విద్యావ్యవస్థ గురించి మనకు చాలా ఆధారములు ఉన్నాయి.ముఖ్యముగా చివరి నిజాం కాలం గురించి పీ వీ నరసింహరావు గారి ది ఇన్ సైడర్ లేదా లోపలి మనిషి నుండి దాసరథి రంగాచార్య వారి ఆత్మ కథ నుండి తెలుస్తున్నదేమిటంటే, ఆ రోజులలో రాజు సహాయం చేసిన విద్య అరబిక్ భాషలో ఉండేదనీ, లేదా ఉర్దూ భాషలోనైనా ఉండేదనీ, తెలుగు భాషద్వారా విద్యావ్యాప్తికి బొత్తిగా రాజాశ్రయం లేదని తెలుస్తున్నది, తరువాత వచ్చిన గ్రంథాలయోద్యమం వంటివాటి ద్వారా ఎక్కువ మంది ప్రజల మాతృభాష అయిన తెలుగు ద్వారా విద్యావ్యాప్తికి ప్రయత్నాలు జరిగినాయని తెలుస్తున్నది.స్వాతంత్ర్యయం తరువాత ఈ సంస్థానములలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకునాయి.చాలా పల్లెలు పోటీ పడి పాఠశాలలు నెలకొల్పినాయి.

బరోడా సంస్థానం మార్చు

ఈ సంస్థానంలోని రాజులు ప్రజలకు ప్రాథమిక విద్య (అనగా ఐదవ తరగతి వరకూ) పూర్తి ఉచితం మరియూ తప్పనిసరి చేసారు, దీనివల్ల స్ఫూర్తి పొందిన గోఖలే మహానుభావుడు ఈ విధానాన్ని భారతదేశం మొత్తం ప్రవేశపెట్టాలని మూడుమార్లు విఫలయత్నాలు చేసాడు.

స్వాతంత్రానంతర విద్యావ్యవస్థ మార్చు

ప్రస్తుత పరిస్థితి మార్చు

చూడండి మార్చు

మూలాలు మార్చు