మంజీర వన్యప్రాణుల అభయారణ్యం

మంజీర వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా యందలి వన్యప్రాణుల అభయారణ్యం.[2] వాస్తవంగా మొదట ఇది మొసళ్ళ సాంచురీ. ప్రస్తుతం సుమారు 70 కంటే ఎక్కువ జాతుల పక్షులు ఇచట సంరక్షింపబడుతున్నాయి. ఇది అంతరించిపోతున్న జాతులు అయిన "మగ్గర్ మొసళ్ళు"కు సంరక్షణా కేంద్రంగా ఉంది. ఈ అభయారణ్యమ్లో రిజర్వాయర్ హైదరాబాదు, సికింద్రాబాదు జంటనగరాలకు త్రాగునీటిని అందుస్తున్నది.[1][2]

మంజీర వన్యప్రాణుల అభయారణ్యం
IUCN category IV (habitat/species management area)
Map showing the location of మంజీర వన్యప్రాణుల అభయారణ్యం
Map showing the location of మంజీర వన్యప్రాణుల అభయారణ్యం
Location of Manjira Wildlife Sanctuary in India
ప్రదేశంతెలంగాణ, భారత దేశము
భౌగోళికాంశాలు17°57′52″N 78°02′22″E / 17.96444°N 78.03944°E / 17.96444; 78.03944[1]
విస్తీర్ణం20 km2 (4,900 acres)
స్థాపితంJune,1978

భౌగోళిక స్థితి మార్చు

మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రం లోని మెదక్ జిల్లాలో ఉంది. ఇది హైదరాబాదు నగరానికి వాయువ్య దిశలో 50 కి.మీ దూరమ్లో ఉంది. ఈ అభయరణ్యంలో మంజీర నది 36 కి.మీ ఆవరించి ఉంటుంది.[2] ఇచ్చట గల కృత్రిమ రిజర్వాయరు హైదరాబాదు, సికింద్రాబాదు నగరాలకు త్రాగు నీటి వసతిని కల్పిస్తున్నది. ఈ రిజర్వాయర్ తొమ్మిది ద్వీపాలను కలిగి ఉంటుంది. వాటిలో కొన్ని పుట్టిగడ్డ, బాపనగడ్డ, సంగమడ్డ, కర్ణంగడ్డ. ఈ ద్వీపములు చిత్తడి నేల సరిహద్దులతో నీటి పక్షులకు గూళ్ళు కట్టుకొనే విధంగా ఉపయోగపడుతాయి. అదనంగా పక్షులకు గూళ్ళు కట్టుకొనుటకు దట్టంగా వ్యాపించిన చెట్లు కూద ఉంటాయి.[1] సవన్నా రకకు శాకాహారం ఈ అభయారణ్యంలో ఉంటుంది. ఈ రిజర్వాయరు మునిగి ఉన్న మొక్కలు, ఆవశ్యక మొక్కలకు తోడ్పడుతుంది. "టైఫా", "ఇపోమియా", "అకాసియా" రకాలైన కొన్ని మొక్కలు నీటిమట్టానికి అంచున మూసివేయబడినట్లు ఉంటాయి. రిజర్వాయరు, నదికి చుట్టూ వ్యవసాయ భూములుంటాయి.[1]

ఈ ప్రాంత సరాసరి ఉష్ణోగ్రతా అవధి 15 °C నుండి 42 °C.[1] వరకు ఉంటుంది.

ఈ ప్రాంత సరాసరి వర్షపాతం సుమారు 915 mm.[1] ఉంటుంది.


మొసళ్ళు మార్చు

1974 లో అంతరించిపోతున్న మొసళ్ల జాతి అయిన "మగ్గర్ మొసలి" తెలంగాణ లోని ప్రవేశించింది. మంజీరా నదిలో నాలుగు జతల మగ్గర్ మొసళ్ళను విడిచిపెట్టారు. ఈ మొసళ్ళను పరిరక్షించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము మొసళ్ళ సంరక్షణా కేంద్రాన్ని ఇచట ప్రారంభింఛింది. 1980ల మధ్యలో మంజీరా ప్రఖ్యాతమైన పక్షి సంరక్షణా కేంద్రంగా నిలిచింది. ఈ కేంద్రం పక్షుల సందర్శకులను ఆకర్షించింది. ప్రస్తుతం సుమారు 300 మొసళ్ళు ఇచట ఉన్నాయి. మొసళ్ళను పునరుత్పత్తి చేయు కార్యక్రమం కూడా జరిగుతుంది.[1]

పార్కు విశిష్ట సమాచారం మార్చు

ఈ అభయారణ్యం పర్యావరణ విద్యా కేంద్రం కలిగి యున్నది. ఇంకులో ఒక మ్యూజియం, గ్రంథాలయం, ఆడిటోరియం ఉన్నాయి. పక్షుల, జంతువుల చలన చిత్రాలను ప్రతిరోజూ చూపిస్తారు. ఈ అభయారణ్యంలో పక్షులను సందర్శకులు చూచుటకు బోట్లు సమకూర్చబడతాయి. సందర్శకులకు దూరదర్శినులు (బైనాక్యులర్స్), పక్షులను గుర్తించేందుకు పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.[3][4]

ఈ అభయారణ్యాన్ని సందర్శించుటకు అనువైన కాలం నవంబరు నుండి మార్చి. ఈ కాలంలో వలస పక్షులు వాటి గూళ్ళను కట్టి గుడ్లను పొదుగుతాయి. సందర్శకులకు వసతి సౌకర్యం కూడా ఉంది. సంగారెడ్డి వద్ద ఇనస్పెక్షన్ బంగ్లా, సింగూర్, సదాశివపేటలలో వసతి కల్పించబడుతుంది.[2][3]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Important Bird Areas in India - A.P." (PDF). Indian Bird Conservation Network. Archived from the original (PDF) on 11 ఏప్రిల్ 2013. Retrieved 30 July 2012.
  2. 2.0 2.1 2.2 2.3 "Manjira Wildlife Sanctuary". Andhra Pradesh Forest Department. Archived from the original on 21 మే 2012. Retrieved 30 July 2012.
  3. 3.0 3.1 "Sanctuary Spotlight". The Hindu. Archived from the original on 25 జనవరి 2013. Retrieved 30 July 2012.
  4. "About Manjira Wildlife Sanctuary". wildlifeinindia.in/. Archived from the original on 23 జూలై 2012. Retrieved 30 July 2012.

ఇతర లింకులు మార్చు