మానసరవళి సామాజిక అంశాల పై తనదైన శైలి, ధోరణితో కవయిత్రి లక్కరాజు వాణి సరోజిని గారు రచించిన తెలుగు పద్య సంపుటి.

మానసరవళి
"మానసరవళీ" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: లక్కరాజు వాణి సరోజిని
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: కవితా సంపుటి
ప్రచురణ:
విడుదల: 2014

మానస రవళి మార్చు

ఈ మానస రవళిలో అనేక కవితలు ఉన్నాయి, కొన్నిటిని ఈ క్రింద ఉదహరించటం జరుగుతుంది. ఈ పుస్తక ఆవిష్కరణ 11-Oct-2014 న విజయవాడ పట్టణంలో గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో పలువురు రచయితల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ ఆవిష్కరణ సభలో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఇలా ప్రశంసించారు.

మానస రవళి ఆవిష్కరణ మార్చు

మానసరవళి కవితా సంపుటిని ఎక్స్‌రే సాహిత్య, సాంస్కృతిక, సేవాసంస్థ ఆధ్వర్యంలో అక్టోబరు 11 2014న ప్రెస్ క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ శానసమండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు ఆవిష్కరించారు.[1] ఈ కార్యక్రమంలో ఆయన కవిత్వం ప్రజల సమస్యలను ప్రతిబింబించాలనీ, సమస్యల మూలాలలోకి వెళ్లి వాటికి పరిష్కారాలు సుచించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి సంచాలకులు ముంజులూరి కృష్ణ కుమారి, ఎక్స్‌రే సాహిత్య సేవా సంస్థ అధ్యక్షుడు కొల్లురి, రచయిత పింగళి వెంకట కృష్ణారావు, కథారచయిత సర్వజిత్ తదితరులు పాల్గొన్నారు.[2] ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి కావూరి సత్యవతి పుస్తక సమీక్ష చేసారు.

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. సాక్షి దిన పత్రికలో మానస రవళి పుస్తక ఆవిష్కరణ 11 Oct 2014
  2. ప్రజా శక్తి (సూర్యారావు పేట), దినపత్రిక దినము 12 Oct 2014 న "సమాజాన్ని మార్చే కవిత్వాలు రాయాలి
"https://te.wikipedia.org/w/index.php?title=మానస_రవళి&oldid=3889959" నుండి వెలికితీశారు