మానుగుంట ఆదినారాయణ రెడ్డి

మానుగుంట ఆదినారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కందుకూరు నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[2]

మానుగుంట మహీధర్ రెడ్డి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1972 - 1978, 1983 - 1989
ముందు దివి కొండయ్య చౌదరి
తరువాత మానుగుంట మహీధర్ రెడ్డి, మానుగుంట ప్రభాకర్‌రెడ్డి
నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1930
మాచవరం గ్రామం, కందుకూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 13 డిసెంబర్ 1988 [1]
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి లలితమ్మ
సంతానం మానుగుంట మహీధర్ రెడ్డి

రాజకీయ జీవితం మార్చు

మానుగుంట ఆదినారాయణ రెడ్డి 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుండి స్వతంత్య్ర అభ్యర్థి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి చెంచు రామనాయుడుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొండయ్య చౌదరిపై ఓడిపోయాడు. ఆదినారాయణ రెడ్డి 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి గుత్తా వెంకటసుబ్బయ్యపై, 1985లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గుత్తా వెంకటసుబ్బయ్యపై ఎమ్మెల్యేగా గెలిచాడు. తరువాత 1989లో ఆయన కుమారుడు మానుగుంట మహీధర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు.[3]

మూలాలు మార్చు

  1. Prajasakti (12 December 2020). "నైతిక విలువలు కలిగిన వ్యక్తి 'ఆదినారాయణరెడ్డి' | Prajasakti". Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.
  2. Sakshi (24 March 2019). "కందుకూరు చూపు.. మానుగుంట వైపు..." Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.
  3. Sakshi (8 July 2018). "వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి మహీధర్‌రెడ్డి". Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.