మీర్జా సైఫీయుల్లా బేగ్

మీర్జా సైఫీయుల్లా బేగ్‌ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసింది.[1][2]

మీర్జా సైఫీయుల్లా బేగ్

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
-
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 1970
మహబూబాబాద్‌, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు మీర్జా ఇమాముల్లా బేగ్‌

జననం, విద్యాభాస్యం మార్చు

మీర్జా సైఫుల్లా బేగ్‌ 1970లో తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్‌ లో జన్మించాడు. ఆయన ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 2002 అక్టోబర్‌ 31న బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.

వృత్తి జీవితం మార్చు

మీర్జా సైఫుల్లా బేగ్‌ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాక న్యాయవాది ఇ.ఉమామహేశ్వర్‌రావు వద్ద జూనియర్‌గా వృత్తిలో మెళుకువలు నేర్చుకొని స్వతంత్రంగా ప్రాక్టీస్‌ మొడులుపెట్టి హైకోర్టులో అన్ని తరహా కేసులను వాదించాడు. ఆయన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రకు, పలు ప్రైవేట్‌ కంపెనీలకు, విద్యాసంస్థలకు ప్యానల్‌ న్యాయవాదిగా, 2014 నుండి 2020 వరకు తెలంగాణ వక్ఫ్‌ బోర్డుకు స్టాండింగ్‌ కౌన్సెల్‌గా పని చేశాడు. ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[2][3] సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2022 మార్చి 22న ఆమోదించాడు.[4]

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (2 February 2022). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
  2. 2.0 2.1 TV9 Telugu (2 February 2022). "తెలంగాణా హైకోర్టుకు 12 మంది కొత్త జడ్జీల నియామకానికి సుప్రీం కోర్టు ఆమోదం." Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhra Jyothy (3 February 2022). "హైకోర్టుకు 12 మంది కొత్త న్యాయమూర్తులు". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
  4. Sakshi (23 March 2022). "హైకోర్టుకు కొత్తగా 10 మంది జడ్జీలు". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.