యోగి పరమేశ్వరదాసు

యోగి పరమేశ్వరదాసు తెలంగాణ రాష్ట్రంకు చెందిన వాగ్గేయకారుడు.[1]

యోగి పరమేశ్వరదాసు
యోగి పరమేశ్వరదాసు
జననంజాజిరి పరమేశ్వరయ్య
1919
తెలంగాణ
మరణంఆగస్టు 17, 1994
తండ్రిభద్రయ్య
తల్లిచిన్నమ్మ

జీవిత విశేషాలు సవరించు

పరమేశ్వరదాసు 1919 సంవత్సరంలో భద్రయ్య, చిన్నమ్మ దంపతులకు ఆదిలాబాదు జిల్లాలో జన్మించాడు. వీరి కుటుంబ వృత్తి బిక్షాటన. ఈయన రాసిన వాటిని పాడుకుంటూ వివిధ గ్రామాల్లో తిరిగేవాడు.[2]

సాహిత్య ప్రస్థానం సవరించు

శరణాగిరి కి చెందిన శ్రీశ్రీశ్రీ నరసింహ్మ యోగి దగ్గర ఉపదేశం పొందాడు. ఈయన రచన ఛందోబద్ధంగా, సరళ భాషతో కూడి ఉంటుంది. హిందీలో కూడా 25 కీర్తనలు రాశాడు.

  1. ఆత్మసాక్షాత్కార మార్గదర్శి (250 తత్వగీతాలు)
  2. యదార్థజ్ఞాన భోధామృతము (103 తత్వకీర్తనలు)
  3. మానవద్గీత (57 తత్వకీర్తనలు)
  4. శ్రీశ్రీ దత్తాత్రేయ భజనమాల (35 కీర్తనలు, 1 మంగళహారతి)

మరణం సవరించు

ఈయన 1994, ఆగస్టు 17న మరణించాడు.

మూలాలు సవరించు

  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (15 September 2019). "వాగ్గేయ వైభవం". www.ntnews.com. మామిడి హరికృష్ణ. Archived from the original on 16 సెప్టెంబరు 2019. Retrieved 27 November 2019.
  2. యోగి పరమేశ్వరదాసు, తెలంగాణ వాగ్గేయ వైభవం (పుస్తకం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, అక్టోబరు 2017, పుట.54