రాగమయి కాళీపట్నం రామారావు గారి ఒకానొక ప్రసిద్ధ నవల. ఈ నవలను రచయిత నవంబరు 1950లో రచించారు. మలి ముద్రణ అక్టోబరు 1974లో జరిగింది.

రాగమయి నవల ముఖ చిత్రము

విశేషాలు మార్చు

  • రచయిత మొదటి పేజీలో ఈ నవలను అంకితమిస్తూ ఇలా రాసుకున్నారు. నేను ఒకప్పుడు మద్రాసు వీధులలో దిక్కు తోచక అల్లాడుతున్నప్పుడు నాకు అయాచితంగా సహాయం చేసిన ఒకానొక గుంటూరు సజ్జనునకు, పేరైనా గుర్తుంచుకొనలేక పోయిన నా కృతజ్నతా హీనతకు శాశ్వత చిహ్నంగా ఈ అంకితం.
  • రచయిత స్త్రీల మధ్య ముఖ్యంగా అత్తాకోడళ్ళ, వదినా మరదళ్ల మధ్య ఉండే సంభాషణలను అత్యంత సహజంగా రాయడం జరిగింది.
  • ఈ నవలికలో ప్రధాన పాత్ర ఉమ. ఒక ఉన్నత వ్యక్తిత్వం గల స్త్రీ ఎన్ని రకాలుగా పరివర్తనం చెందుతుందో రచయిత అద్భుతంగా చిత్రీకరించారు. ఉమ లాంటి వారు ఒక్కరు ఉన్నా, ఆమెతో ముడిపడి ఉన్న ఎన్నో కుటుంబాలు ఏ విధమైన కలతలు లేకుండా సాఫీగా సాగిపోతాయి.

పాత్రలు మార్చు

  • ఉమ
  • జానకి
  • గిరిజమ్మ
  • సుందరమ్మ
  • శేఖరం
  • రాజశేఖరం
  • శేషగిరి

కథా గమనము మార్చు

రచయిత ఇతర రచనలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=రాగమయి&oldid=2097966" నుండి వెలికితీశారు