రాజగిరి

బీహార్ రాష్ట్రం లోని పట్టణం

భారత రాష్ట్రమైన బీహార్ లోని నలంద జిల్లాలో గుర్తింపు పొందిన నగరం రాజగిరి. రాజగిరి నగరం మగధ సామ్రాజ్యము యొక్క మొదటి రాజధానిగా ఉండేది, చివరికి మౌర్య సామ్రాజ్యంలో ఒక రాష్ట్రంగా విస్తరించింది. ఈ నగరానికి గల ఇతర పేర్లు రాజగృహ, గిరివ్రజం. ఈ నగర పుట్టుక తేది తెలియరాలేదు, అయితే క్రీ.పూ 1000 నాటి సిరమిక్స్ ఈ నగరంలో కనుగొనబడ్డాయి. మహావీర , గౌతమ బుద్ధులకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటిగా ఈ ప్రాంతం బౌద్ధమతం , జైనమతంలో కూడా గుర్తింపు పొందింది[1], , పేరొందిన అతనతియ సుత (Atanatiya Sutta) సమావేశం ఇక్కడి రాబందు శిఖర పర్వతం (Vulture's Peak mountain) వద్ద జరిగింది. రాజగిరి రైలు , రోడు మార్గాలచే భక్తియార్పూర్ వయా పాట్నాకు అనుసంధానించబడింది. రాజగిరి పాట్నా , మొకమెహ్ రెండింటి నుంచి దాదాపు 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇది రాతి కొండలు చుట్టుముట్టి ఉన్న ఒక ఆకుపచ్చ లోయలో ఉంది. భారతీయ రైల్వే నేరుగా రాజగిరి నుండి న్యూఢిల్లీకి షరంజీవి ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది.

రాజగిరి
నగరం
రాజగిరిలో ఉన్న విశ్వ శాంతి స్తూపం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 80 శాంతి గోపురాలలో ఇది ఒకటి.
రాజగిరిలో ఉన్న విశ్వ శాంతి స్తూపం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 80 శాంతి గోపురాలలో ఇది ఒకటి.
Country భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లానలంద
Elevation
73 మీ (240 అ.)
Population
 (2011)
 • Total41,619
భాషలు
 • అధికారమగధి, హిందీ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
803116
టెలిఫోన్ కోడ్916112
Vehicle registrationBR
లింగ నిష్పత్తి1000/889 /
అక్షరాస్యత51.88%
లోక్ సభ నియోజకవర్గంనలంద
విధానసభ నియోజకవర్గంరాజగిరి(SC)(173)

మూలాలు మార్చు

  1. Jain Dharma ka Maulik Itihas Part-1, Ed. Acharyashri Hastimalji Maharaj, 1971 p. 739-742
"https://te.wikipedia.org/w/index.php?title=రాజగిరి&oldid=3571978" నుండి వెలికితీశారు