రాజలక్ష్మి పార్థసారథి

భారత విలేకరి, విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్త

శ్రీమతి వైజిపిగా ప్రసిద్ధి చెందిన యెచా గుంజ రాజలక్ష్మి పార్థసారథి(27 నవంబర్ 1925 - 6 ఆగస్టు 2019), భారతీయ జర్నలిస్ట్, విద్యావాది, సామాజిక కార్యకర్త. [1] ఆమె పద్మ శేషాద్రి బాల భవన్ వ్యవస్థాపకురాలు, డీన్. రాజాలక్ష్మి కి సాహిత్యం, విద్యకు ఆమె అందించిన సేవలకు గాను 2010లో పద్మశ్రీ పురస్కారం లభించింది. [2]

రాజలక్ష్మి పార్థసారథి
జననం
రాజలక్ష్మి

(1925-11-27)1925 నవంబరు 27
బ్రిటిష్ ఇండియా
మరణం2019 ఆగస్టు 6(2019-08-06) (వయసు 93)
విద్యమద్రాసు విశ్వవిద్యాలయం
వృత్తివిద్యావాది, జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త
జీవిత భాగస్వామివై.జి. పార్థసారథి
పిల్లలు2 వై.జి. రాజేంద్రన్, వై.జి. మహేంద్రన్
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం(2010)
వాయుశ్రేష్ఠ సమ్మాన్' అవార్డు (భారత ప్రభుత్వం )
'పాల్ హారిస్ ఫెలో అవార్డు'(రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ )

వ్యక్తిగత జీవితం మార్చు

రాజలక్ష్మి మద్రాసులో 27 నవంబర్ 1925న సంపన్న, విద్యావంతురాలైన కుటుంబంలో, బర్మా షెల్ ఉద్యోగి ఆర్.పార్థసారథి కుమార్తె, ఆయన భార్య అలమేలు అమ్మదంపతులకు జన్మించింది. ఆమె తండ్రి భారత స్వాతంత్ర్య కార్యకర్త దివాన్ బహదూర్ టి.రంగాచారి కుమారుడు, ఆమె తల్లి గృహిణి. ఆమె బంధువు కె.బాలాజీ తమిళ చిత్ర పరిశ్రమలో నటుడు, దర్శకుడు. [3]

రాజలక్ష్మి మద్రాసులోని సెయింట్ జాన్స్ స్కూల్, హోలీ క్రాస్ కళాశాలలో చదువకుని, 1947లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందింది. ఆమె తన తరగతిలో ఉన్న ఏకైక మహిళ, ఆమె కుటుంబంలో గ్రాడ్యుయేట్ అయిన మొదటి మహిళ. ఆమె ఎం.ఎడ్ పూర్తి చేసి, మద్రాసు విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని పొందింది.

ఆమె నాటక రచయిత వై.జి. పార్థసారథిని వివాహం చేసుకుంది, వారికి ఇద్దరు కుమారులు వై.జి. రాజేంద్రన్, వై.జి. మహేంద్రన్( చలనచిత్ర, రంగస్థల నటుడు) ఉన్నారు. గుండె ఆగిపోవడం వల్ల రాజలక్ష్మి తన 93వ ఏట 6 ఆగస్టు 2019న చెన్నైలో మరణించింది. [3]

కెరీర్ మార్చు

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత రాజలక్ష్మి ది హిందూ, తమిళ వారపత్రిక కుముడంలో జర్నలిస్ట్ గా పనిచేసింది. అయితే ఆమె వివాహం తరువాత తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి 1958లో పద్మ శేషాద్రి బాల భవన్ ను ప్రారంభించింది.

పద్మ శేషాద్రి బాల భవన్ మార్చు

1958లో నుంగంబాక్కంలోని తన ఇంటి టెర్రస్ లో ఉన్న షెడ్లో నుంగంబాక్కం లేడీస్ రిక్రియేషన్ క్లబ్ సభ్యులతో కలిసి రాజలక్ష్మి 13 మంది విద్యార్థులతో ఒక పాఠశాలను ప్రారంభించింది , దాని శ్రేయోభిలాషులలో ఒకరైన ఆర్‌ఎం శేషాద్రి కోరికలకు గౌరవసూచకంగా దానికి పద్మ శేషాద్రి బాల భవన్ అని పేరు పెట్టారు. మరుసటి సంవత్సరం పాఠశాల తన సొంత భవనాన్ని సంపాదించుకుంది. 1971లో పాఠశాల తన మొదటి శాఖను నుంగంబాక్కంలో స్థాపించింది (దీనిని ప్రధాన పాఠశాల అని కూడా పిలుస్తారు). 2009 లో 8,000 మంది విద్యార్థులు, 500 మంది సిబ్బందితో ఐదు శాఖలను కలిగి ఉంది. రాజలక్ష్మి 1958లో ప్రారంభమైనప్పటి నుండి, ఆమె మరణించే వరకు పాఠశాల డీన్, డైరెక్టర్ గా పనిచేశారు. ఆమె స్థానంలో ఆమె కోడలు శ్రీమతి షీలా రాజేంద్రన్ ను డీన్, డైరెక్టర్ నియమించారు. [4]

అవార్డులు మార్చు

  • పద్మశ్రీ పురస్కారం(2010)
  • 'అచీవ్ మెంట్ మెడల్ ఫర్ లీడర్ షిప్ అండ్ కమిట్ మెంట్ టు ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్' (అమెరికా)
  • 'వాయుశ్రేష్ఠ సమ్మాన్' అవార్డు (భారత ప్రభుత్వం )
  • 'పాల్ హారిస్ ఫెలో అవార్డు'(రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ )

మూలాలు మార్చు

  1. "Ramayana parayanam not to worship Ram but his qualities: Venkaiah Naidu at PSBB's Dr Rajalakshmi Parthasarathy Memorial lecture | edexlive". m.edexlive.com. Archived from the original on 2022-01-26. Retrieved 2022-01-26.
  2. Mathai, Kamini; Aug 6, Pushpa Narayan / TNN / Updated:; 2019; Ist, 20:04. "Mrs YGP, founder of PSBB schools, dies in Chennai | Chennai News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-01-26. {{cite web}}: |last3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  3. 3.0 3.1 "Educationist Mrs. YGP passes away". The Hindu (in Indian English). Special Correspondent. 2019-08-06. ISSN 0971-751X. Retrieved 2022-01-26.{{cite news}}: CS1 maint: others (link)
  4. "Renowned educationist and PSBB founder Mrs YGP dies". The New Indian Express. Retrieved 2022-01-26.