రాయచూరు అంతర్వేది

కృష్ణా, తుంగభద్ర నదులు మధ్యనున్న త్రిభుజాకారపు ప్రాంతాన్ని రాయచూరు అంతర్వేది లేదా రాయచూరు దోబ్ అంటారు. దోబ్ అన్న పదము దో+అబ్ అన్న రెండు పదాల కలయిక (అబ్ అంటే పర్షియన్ లో నీరు అని, దో అంటే రెండు). సారవంతమైన ఈ ప్రాంతము దక్షిణభారత దేశ చరిత్రలో మధ్యయుగాలలో ముఖ్య పాత్ర పోషించింది. కర్ణాటక లోని రాయచూరు, కొప్పల్ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లోని గద్వాల జిల్లా, రాయచూరు అంతర్వేదిలో భాగం. ఈ ప్రాంతములో ముఖ్య పట్టణమైన రాయచూరు మీదుగా ఈ ప్రాంతానికి రాయచూరు అంతర్వేది అన్నపేరు వచ్చింది.

విజయనగర రాజులు, దక్కను సుల్తానుల మధ్య రాయచూరు అంతర్వేదిపై ఆధిపత్య విషయము అనేక యుద్ధాలకు దారి తీసినది. ఇక్కడ రాయచూరు, ముద్గల్లు కోటలు ఉన్నాయి

వ్యవసాయం మార్చు

కృష్ణ, తుంగ భద్ర నదుల వలంబ ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. సింధనూరు, గంగావతి, సిరుగుప్పలు కర్ణాటకలో కెల్లా అత్యధిక ధాన్యాన్ని పండిస్తాయి. బత్తాయి తోటల పెంపకానికి రాయచూరు జిల్లాది రాష్ట్రం లోనే ప్రథమ స్థానం.[1]

సహజ వనరులు, పరిశ్రమలు మార్చు

లింగసూగూరు తాలూకాలో ఉన్న హట్టి బంగవరు గనులకు ప్రాసిద్ధి. భారతదేశంలో ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న బంగారు గనులు ఇదొక్కటే. అశోకుడి కంటే ముందు నుండే ఇక్కడ బంగారు గనులుండేవి. 19 వ శతాబ్ది చివరిలో ఇక్కడ బంగారు గనులను తిరిగి కనుగొన్నారు.

దేవసూగూరు వద్ద ఉన్న రాయచూరు తాప విద్యుత్ కేంద్రం 1986 లో ఉత్పత్తి మొదలుపెట్టింది. కర్ణాటకలో తొట్టతొలి తాప విద్యుత్ కేంద్రం ఇది.

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-12-23. Retrieved 2020-06-12.