రెండవ రాజేంద్రచోళుడు

రెండవ రాజేంద్ర చోళుడు 11 వ శతాబ్దంలో తన అన్నయ్య రాజధిరాజ చోళుడి తరువాత చోళ రాజుగా పరిపాలించాడు.[3] 1052 లో తన సోదరుడు మరణించిన తరువాత తన అన్నయ్యతో పాటు కొప్పం యుద్ధంలో చాళుక్యరాజు మొదటి సోమేశ్వరుడుతో చేస్తున్న పోరాటంలో తాను వహించిన పాత్ర ద్వారా ఆయన బాగా గుర్తుండిపోయాడు. ఆయన ప్రారంభ పాలనలో శ్రీలంకకు ఒక దండయాత్ర జరిగింది. ఈ యుద్ధసమయంలో శ్రీలంక సైన్యాన్ని తరిమికొట్టగా వారి రాజు పొలోనారువా మొదటి విజయబాహు ఒక పర్వత కోటలో ఆశ్రయం పొందటానికి నడిపించారు.[4]

రెండవ రాజేంద్రచోళుడు
రాజకేసరి
Rajendra II Territories c. 1059 CE
Reign1054–1063 CE
Predecessorరాజాధిరాజ చోళుడు
Successorవీరరాజేంద్ర చోళుడు
మరణంc. 1063 సా.శ
QueenRajarajan Arumoliyar alias Tennavan Mādevi, queen of Rajendradeva,[1]
Uruttiran Arumoli alias PirudiMādeviyar,[2]
KōKilānadigal
తండ్రిమొదటి రాజేంద్ర చోళుడు

యుద్ధంలో (సా.శ.1052) ఆయన సోదరుడు మరణించిన సమయంలో తన సమయస్ఫూర్తిని ఉపయోగించి రెండవ రాజేద్రచోళుడు స్వయంగా పట్టాభిషిక్తుడై సమర్ధవంతంగా యుద్ధం కొనసాగించి విజయం సాధించాడు.[5] తరువాత ఆయన చోళ సామ్రాజ్యపాలన కొనసాగించాడు. నమోదిత వ్రాత ఆధారాలు చోళ సామ్రాజ్యం తన పాలనలో భూభాగాన్ని కోల్పోలేదని చూపిస్తుంది.[6][6]

కొప్పం యుద్ధం మార్చు

సా.శ. 1053–54లో తుంగభద్ర నది మీద ఉన్న కొప్పం (కొప్పలు) వద్ద చోళ దళాలు చాళుక్యను సైన్యంతో పోరాడుతున్నాయి.[7][8] రాజధీరాజ వ్యక్తిగతంగా చోళ సైన్యాన్ని యుద్ధ ఏనుగు పైన నుండి నడిపించాడు. రాజాధిరాజ తమ్ముడు యువరాజు రాజేంద్ర తనను తాను అన్నను వెంబడించాడు. అప్పుడు చాళుక్యసైన్యం చోళ రాజు స్వారీ చేస్తున్న ఏనుగు మీద దృష్టి కేంద్రీకరించి ఆయనను ప్రాణాపాయం కలిగించేలా గాయపరిచారు. చక్రవర్తి చనిపోవడాన్ని చూసి చోళ సైన్యం అస్తవ్యస్తంగా వెనక్కి తగ్గింది.[9] ఆ దశలో రాజేంద్ర రంగంలోకి దిగారు. మరోసారి చాళుక్య సైన్యం నాయకుడి మీద దృష్టి పెట్టింది. రెండవ రాజేంద్ర ధైర్య సాహసాలలో తండ్రికి సమానుడు. పుట్టుకతో వచ్చిన మానవ నాయకుడు. వారి రాజు మొదటి రాజాధిరాజ మరణంతో చోళసైన్యం గందరగోళంలో ఉందని ఆయన తదుపరి చోళ చక్రవర్తిగా బాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటించాడు. సమర్థవంతమైన చోళ సైన్యాన్ని విడిచిపెట్టకుండా పోరాడమని ఆదేశించాడు.[10] యుద్ధభూమిలో ముందుండి నాయకత్వం వహించాలని నిర్ణయించుకోవడం ద్వారా ఆయన అసమానమైన ప్రతిస్పందన, క్రమాన్ని పునరుద్ధరించి తన సైన్యంలోని మొదటి రాజరాజా, మొదటి రాజేంద్ర చోళుడు కాలం నుండి చోళ సైన్యానికి సేవలందిస్తున్న అనేక మంది సైనికాధికారులు, మేనల్లుళ్ళు మొదలైన వారిని ప్రోత్సహించి యుద్ధం కొనసాగించాడు. చాళుక్య సైన్యం తన అసలు నాయకుడిని కోల్పోయిన ఏ యుద్ధంలో అయినా ఈ రకమైన ప్రతిచర్యకు సిద్ధపడలేదు. రెండవ రాజేంద్ర -2 శాసనాలు కొప్పం వద్ద జరిగిన యుద్ధంలో ఆయన అన్నయ్య మొదటి రాజధీరాజా- చంపబడ్డాడని మనకు తెలుసు. ఇందులో రెండవ రాజేంద్ర తన ఇతర సోదరులతో కలిసి యుద్ధంలోపాల్గొన్నాడు. రెండవ రాజేంద్ర- కూడా మొదట్లో గాయపడి, యుద్ధం నుండి వైదొలిగాడు. కాని ఆయన తిరిగి వచ్చి అహవమల్ల మీద తిప్పాడు (మొదటి సోమేశ్వర- తనను తాను 'త్రైలోక్యమల్లా' అని పిలిచాడు - మూడు ప్రపంచాల ప్రభువు). మణిమంగళం నుండి ఆయన రాసిన శాసనాల నుండి యుద్ధం చివరిలో, చాళుక్యులు ఓడిపోయారని, వారి సైన్యంలోని అనేక మంది అధికారులు మైదానంలో చనిపోయారని మేము అర్థం చేసుకున్నాము. ఈ యుద్ధంలో బహుళ ప్రత్యర్థులు. సలుక్కి, పులికేసి, దాసపన్మాను తమ్ముడు జయసింగను రాజేంద్రదేవ చేత చంపబడ్డాడు.[11][12]

ప్రస్తుత మహారాష్ట్రలోని కొల్లాపూరు ఈ కొల్లాపురం గుర్తించబడింది.[13] రాజేంద్ర ఇతర శాసనాల ఆధారంగా చరిత్రకారుడు హల్ట్జు కొల్లాపురం యుద్ధం మునుపటి యాత్ర అని ప్రతిపాదించాడు, ఇందులో రాజేంద్ర తన అన్నయ్య రాజాధిరాజా ఆధ్వర్యంలో పాల్గొన్నాడు.[14] మరికొందరు చరిత్రకారులు కూడా ఈ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. వారు చాళుక్యుల రాజధాని కల్యాణపురం దహనం చేయడం, కొల్లాపురంలో విజయం సాధించడం, మరో రెండు వేర్వేరు సంఘటనల ఘనతను మొదటి రాజధీరాజ చోళుడికి ఇచ్చారు.[15]

సింహాసన అధిరోహణ మార్చు

 
గంగై కొండ చోళపురం

తన పిల్లల మీద వారసుడిగా తన అన్నయ్య రాజధిరాజ చోళుడు తన వారసుడుగా ప్రతిపాదించిన రెండవ రాజేంద్ర కొప్పం యుద్ధభూమిలో తనను తాను రాజుగా ప్రకటించుకుని యుద్ధంలో విజయం సాధించిన తరువాత తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు.[7]

కొప్పం యుద్ధం తరువాత చోళ శాసనాల్లో మాత్రమే ఇది కనబడుతుందని గమనించాలి. ఈ యుద్ధంలో చాళుక్య సమకాలీన చరిత్రకారులు మౌనంగా ఉన్నారు. యుద్ధం గురించిన చాళుక్య వృత్తాంతం c సా.శ. 1071 నాటి శాసనంలో మాత్రమే కనుగొనబడింది. ఇది దాదాపు 15 సంవత్సరాల విరామం తరువాత ఈ సంఘటనను వివరిస్తుంది. ఇందులో రాజాధిరాజా మరణం గురించి మాత్రమే ప్రస్తావించింది.[ఆధారం చూపాలి]

తరువాత చోళ కవితా రచనలు కళింగతుపరణి, " విక్రమచోళుడు ఉలా " ఈ యుద్ధాన్ని చాలా వివరంగా వివరించారు.[ఆధారం చూపాలి]

ఇతర చాళుక్య యుద్ధాలు మార్చు

కొప్పం యుద్ధంలో జరిగిన అవమానాన్ని తుడిచిపెట్టడానికి ఆత్రుతగా ఉన్న చాళుక్యులు గొప్పశక్తి సమీకరించుకుని చోళ దేశాన్ని ఆక్రమించారు. c సా.శ.1062 సైన్యాలు ముద్దకరు నది వద్ద (తుంగభద్ర, కృష్ణ నది సంగమం వద్ద) కలుసుకున్నాయి.[9] చాళుక్య కమాండరు దండనాయక వలదేవ మృతి చెందగా రాజమహేంద్రచోళుడి నేతృత్వంలోని చోళులు ఆక్రమణను ప్రతిఘటించారు. రాజమహేంద్రచోళుని పక్షాన జరిగిన యుద్ధ పోరాటంలో వీరరాజేంద్ర చోళుడు కూడా పాల్గొన్నాడు.[ఆధారం చూపాలి]

వేంగిని తీసుకోవటానికి పాశ్చాత్య చాళుక్యులు చేసిన దండయాత్రను కూడా అదే యుద్ధభూమిలో చోళులు అడ్డుకున్నారు. తదనంతరం మొదటి సోమేశ్వర కూడా రెండవ రాజేంద్ర వీరరాజేంద్ర ఆధ్వర్యంలో కుదళసంగమం వద్ద చోళ సైన్యాన్ని ఎదుర్కొన్నారు. దీని ఫలితంగా చాళుక్యురాజు మరో భారీ ఓటమిని ఎదుర్కొన్నాడు.[ఆధారం చూపాలి]

కళాసక్తి మార్చు

ఆయన తన అన్నయ్య మొదటి రాజధీరాజ చోళుడి ఉప రాజప్రతినిధి అయినప్పుడు ఆయన రాజ్య అంతర్గత వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా పనిభారాన్ని పంచుకున్నాడు. ఆయన నృత్యం, నాటక రంగానికి గొప్ప పోషకుడుగా ఆయన వివిధ కళాకారులను, కవులను ప్రోత్సహించిన అనేక సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు తంజావూరు.[16][17] దీని వార్షిక ఉత్సవాలలో నృత్య, సంగీత ప్రదర్శనలలో పాల్గొన్నందుకు ఫలితంగా నర్తకి ఈ ప్రయోజనం కోసం 120 కలాం వరి ధాన్యాన్ని పొందవలసి ఉంది.[18]

కుటుంబం మార్చు

ఆయన పాలన 4 వ సంవత్సరం నుండి ఆయన బంధువుల సంఖ్య మనకు తెలిసింది. వీరు పితృసంబధిత పెదతండ్రులు, పిన తండ్రులు, 4 మంది తమ్ముళ్ళు, 6 మంది కుమారులు, ఇద్దరు మనవళ్లు ఉన్నారు. ఈ తమ్ముళ్ళలో ఒకరుగా వీరరాజేంద్ర చోళుడు ఉన్నాడు. ఆయనకు కరికాల చోళుడు అనే బిరుదును ప్రదానం చేశారు.[12]

విజయాలు మార్చు

రెండవ రాజేంద్ర చోళుడు తన పూర్వీకుల మాదిరిగానే పాండ్యరాజ్యం మీద అప్పటికే నియంత్రణ కలిగి ఉన్నాడు. చాళుక్య పాలకుడు మొదటి సోమేశ్వరను ఓడించిన తరువాత ఆయన కళింగ రాజ్యానికి అలాగే ఇలంగై (శ్రీలంక) వరకు దండయాత్ర కొనసాగించాడు. శ్రీలంక రాజు మనభరణనుకు కళింగ రాజు వీర సాలమేఘా సహాయపడ్డాడు. ఆయన అయోధ్య, కన్యాకుబ్జా, రత్తపాడి, కడారం వంటి ఇతర భూభాగాలను కూడా తన ఆధీనంలో తీసుకున్నాడు. కళింగ యుద్ధంలో కళింగరాజు చంపబడ్డాడు. మనభరణను ఆయన ఇద్దరు కుమారులు పట్టుబడ్డారు.[ఆధారం చూపాలి]

మూలాలు మార్చు

  1. A Topographical List of Inscriptions in the Tamil Nadu and Kerala States: Tiruchchirappalli District, page 186
  2. Epigraphy By Archaeological Survey of India. Southern Circle, page 76
  3. The History and Culture of the Indian People: The struggle for empire, page 241
  4. Sri Varadarajaswami Temple, Kanchi: A Study of Its History, Art and Architecture, page 13
  5. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. pp. 46–49. ISBN 978-9-38060-734-4.
  6. 6.0 6.1 The Cambridge Shorter History of India p.190
  7. 7.0 7.1 Ancient Indian History and Civilization, page 384
  8. The Cambridge Shorter History of India, page 190
  9. 9.0 9.1 Ancient Indian History and Civilization von Sailendra Nath Sen p.384
  10. Ancient Indian History and Civilization by Sailendra Nath Sen: p.384
  11. South Indian Inscriptions: Miscellaneous inscriptions in Tamil (4 pts. in 2), page 62
  12. 12.0 12.1 Benjamin Lewis Rice. Mysore Gazetteer, Volume 2, Part 2. Government Press, 1930 – Karnataka (India). p. 1074.
  13. The early history of the Deccan, Volume 1, page 327
  14. The Cōḷas, page 279
  15. The Chālukyas of Kalyāṇa and the Kalachuris, page 172
  16. Bharatanatyam, the Tamil heritage, page 42
  17. Middle Chola temples: Rajaraja I to Kulottunga I (A.D. 985–1070), page 266
  18. Archaeology and art: Krishna Deva felicitation volume, Part 2, page 554
అంతకు ముందువారు
రాజేంద్రచోళుడు
చోళ
1051–1063 CE
తరువాత వారు
వీరరాజేంద్ర చోళుడు

వనరులు మార్చు

  • Nilakanta Sastri, K.A. (1935). The CōĻas, University of Madras, Madras (Reprinted 1984).
  • Nilakanta Sastri, K.A. (1955). A History of South India, OUP, New Delhi (Reprinted 2002).
  • The History and Culture of the Indian People: The struggle for empire By Ramesh Chandra Majumdar, Bhāratīya Itihāsa Samiti
  • Ancient Indian History and Civilization By Sailendra Nath Sen
  • Epigraphia Carnatica, Volume 10, Part 1 By Benjamin Lewis Rice, Mysore (India : State). Archaeological Dept, Mysore Archaeological Survey
  • The early history of the Deccan, Volume 1 By Ghulām Yazdānī
  • Sri Varadarajaswami Temple, Kanchi: A Study of Its History, Art and Architecture By K.V. Raman
  • The Chālukyas of Kalyāṇa and the Kalachuris By Balakrishnan Raja Gopal
  • Epigraphia Indica and record of the Archæంlogical Survey of India, Volume 7 By Archaeological Survey of India
  • Bharatanatyam, the Tamil heritage By Lakshmi Viswanathan
  • Middle Chola temples: Rajaraja I to Kulottunga I (A.D. 985–1070) By S. R. Balasubrahmanyam
  • Archaeology and art: Krishna Deva felicitation volume, Part 2 By Krishna Deva, Chitta Ranjan Prasad Sinha, Bipin Kumar Jamuar, Umesh Chandra Dwivedi, Shri Bhagwan Singh