రైతుబిడ్డ (1971 సినిమా)

1971 సినిమా

'రైతు బిడ్డ' తెలుగు చలన చిత్రం 1971 మే 19 న విడుదల. బి. ఎ. సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, వాణీశ్రీ జంటగా నటించారు. ఇంకా శాంతకుమారి, కైకాల సత్యనారాయణ, అనూరాధ మొదలగు వారు నటించారు.సంగీతం సాలూరు హనుమంతరావు అందించారు .

గూడవల్లి రామబ్రహ్మం నిర్మించిన సినిమా వివరాలకోసం రైతుబిడ్డ (1939 సినిమా) చూడండి.

రైతుబిడ్డ
(1971 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.ఎ. సుబ్బారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
వాణిశ్రీ
సంగీతం సాలూరి హనుమంతరావు
నిర్మాణ సంస్థ నవభారత్ మూవీస్
భాష తెలుగు

రైతు బిడ్డ (Raitu Bidda) 1971లో వెలువడిన ఒక తెలుగు సినిమా.

ఒక రైతు కుటుంబం, బాధ్యత నెరిగిన అన్న, చదువుకున్న తమ్ముడు, వీరంటే గిట్టనివారు, అన్నకూ తమ్మునికి మధ్య కలహాలూ, చివరకు అందరూ కలవటం చిత్రకథ. రామరావు ,రైతుగా,వాణిశ్రీ టీచరుగా, తమ్మునిగా జగ్గయ్య, కథానాయకునికి మేలు చేసే పాత్రలో రాజనాల నటించారు. ఆ అనురాగం, విరిసిన మరుమల్లి, దేవుడు సృష్టించాడు లోకాలు వంటి హిట్ గీతాలున్నాయి. చిత్రకథ 'మనోజ్ కుమార్' యొక్క 'ఉప్‌కార్' చిత్రానికి దగ్గరగా ఉంటుంది. ఐతే తర్వాత ఘట్టమనేని కృష్ణ చిత్రం పాడిపంటలులో ఈ పోలికలూ మరింత స్పష్టం గా కనిపిస్తాయి.

తారాగణం

మార్చు

నందమూరి తారక రామారావు

వాణీశ్రీ

శాంతకుమారి

కైకాల సత్యనారాయణ

అనూరాధ

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: బి.ఎ.సుబ్బారావు

సంగీతం: సాలూరు హనుమంతరావు

నిర్మాత: కోట్ల వెంకట్రామయ్య

నిర్మాణ సంస్థ: లక్ష్మికళా చిత్ర

గీత రచయితలు:కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి

నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి, పి.జె.సుకుమార్

నిర్వహణ:,మేడా వెంకటరమణ

విడుదల:19:05:1971.

పాటల జాబితా

మార్చు

1.దేవుడు సృష్టించాడు లోకాలు, గానం .ఘంటసాల బృందం, రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి

2.రైతే రాజ్యం ఏలాలి , గానం .ఘంటసాల, పులపాక, సుశీల బృందం , రచన: కొసరాజు.

3.అ అమ్మ...ఆ .... ఆవు, గానం .ఘంటసాల, సుశీల, రచన: సింగిరెడ్డి. నారాయణ రెడ్డి.

4.విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్లి ముత్యాల, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, రచన: సి.నారాయణ రెడ్డి .

5.అ అమ్మ ఆ ఆవు అమ్మవంటిదే అది తెలుసుకో నీవు, గానం.పి.సుశీల బృందం, రచన.సి నారాయణ రెడ్డి

6 అర్థరేతిరి నిద్దురపొద్దున వచ్చావా ఈ పరాయి, గానం: పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్ ఆర్ ఈశ్వరి, రచన:కొసరాజు

7.మనిషిని నమ్మితే ఏముందిరా మబ్బును నమ్మినా, గానం పి.జె.సుకుమార్, రచన: సి నారాయణ రెడ్డి

8.వెడలె యధునందనుడు (నాటకం), గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ఆర్ ఈశ్వరి, మాధవపెద్ది సత్యం బృందం, రచన: సి నారాయణ రెడ్డి.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.