లిటిల్ రాస్కెల్

లిటిల్ రాస్కెల్
కృతికర్త: మల్లాది వెంకటకృష్ణమూర్తి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: నవసాహితి బుక్ హౌస్, ఏలూరు రోడ్, విజయవాడ
విడుదల:

నవల యొక్క సంక్షిప్త కథ మార్చు

సాంబశివరావు ఒక బ్యాంకు ఉద్యోగి. ఆ బ్యాంకు రిక్రియేషన్ క్లబ్ ఎనివర్సరీ సెలబ్రేషన్ జరుగుతుంది. ఆ సెలబ్రేషన్ లో ధశరధరామయ్య గారు గతం చెప్పటంతో నవల ప్రారభం అవుతుంది. ఇందులోని ముఖ్య పాత్రధారి పేరు రాజేష్ (లిటిల్ రాస్కెల్). రాజేష్ వాళ్ళ అమ్మ సావిత్రి. ఆవిడ దగ్గరే రాజేష్ పెరుగురతాడు. రాజేష్ అమ్మ సావిత్రి దగ్గర నుండి రైలులో రాజేష్ ను ధశరధరామయ్య గారైన వాళ్ళ కొడుకు సాంబశివరావు దగ్గరకు రాజేష్ ని పంపిస్తుంది. రాజేష్ అమ్మ సావిత్రి రాజేష్ కి వాళ్ళ దగ్గర ఎలా ఉండాలో ఎలా ఉండ కూడాదో మరి మరి చెప్పి పంపిస్తుంది. సాంబశివరావు భార్య సాహితి. ధశరధ రామయ్య గారి కుటుంబానికి, రాజేష్ కి తల్లి అయిన సావిత్రికి ఏ విధమైన సంభంధం ఉండదు. మరి రాజేష్ తల్లి అయిన సావిత్రి ఎందుకు వాళ్ళ దగ్గరకే రాజేష్ ని పంపిందో తెలుసుకోవాలంటే ఆసక్తికరంగా, తప్పక చదవవలసిన నవల లిటిల్ రాస్కెల్.

ఈ నవలలోని విశేషాలు మార్చు

  • ఈ నవలలో తాత మనవల మధ్య జరిగే సంఘటనలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.
  • రాజేష్ అల్లరు చేష్టలు.
  • జెమిని టీవీ లో నాన్న అనే పేరుతో ధారావాహిక ను గుణ్ణం గంగరాజు గారు నిర్మించారు. అది మంచి ఆదరణ పొందింది.

మూలాలు మార్చు