నా పేరు ఎన్.వరలక్ష్మి. నేను తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణ వాసిని. ప్రస్తుతం నేను హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నాను. నేను ప్రముఖ బహుళజాతి సంస్థ అయిన విప్రో టెక్నాలజీస్ లో పని చేస్తున్నాను. నా స్వస్థలం రామచంద్రపురం సమీపంలోని సోమేశ్వరం గ్రామం. నేను ప్రాథమిక విద్యను వేమగిరి, ధవళేశ్వర గ్రామములందు మరియు మాధ్యమిక విద్యను రాజమండ్రిలోను అభ్యసించాను. అటు పిమ్మట డిగ్రి కంప్యూటర్ సైన్స్ విభాగంలో కాకినాడ పి.ఆర్ ప్రభుత్వ కళాశాల లో పూర్తి చేసాను. నేను తీరిక సమయాలలో క్యారమ్స్ ఆడటం, నవలలు చదవటం చేస్తుంటాను.