వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2007 51వ వారం

భారతదేశ స్వపరిపాలనా విషయాలను చర్చింటానికి బ్రిటీషు ప్రభుత్వం 1930 నుండి 1932 వరకు లండన్ లో నిర్వహించిన మూడు అఖిల పక్ష సమావేశాలను రౌండు టేబులు సమావేశాలు లేదా గుండ్రపు బల్ల సమావేశాలు అంటారు. భారత స్వపరిపాలనపై సైమన్ కమిషను ఇచ్చిన నివేదిక పర్యవసానంగా 1930-32 లలో బ్రిటిషు ప్రభుత్వం రౌండు టేబులు సమావేశాలను ఏర్పాటు చేసింది. స్వపరిపాలన కోరిక దేశంలో క్రమేణా బలపడుతూ వస్తోంది.

మొదటి రౌండు టేబులు సమావేశం 1930, నవంబర్ 13న ఐదవ జార్జి అప్పటి బ్రిటీషు ప్రధానమంత్రి రాంసే మెక్‌డోనాల్డ్ అధ్యక్షతన ప్రాంభమైంది. భారత జాతీయ కాంగ్రేసు దేశములోని వ్యాపారవేత్తలతో పాటు సమావేశాలను బహిష్కరించినది. చాలామంది కాంగ్రేసు నేతలు అప్పటికే సహాయనిరాకరణోద్యమములో పాల్గొని జైళ్లలో ఉన్నారు. రెండవ రౌండు టేబులు సమావేశం లండన్లో సెప్టెంబర్ 7, 1931న ప్రారంభమయ్యింది. రెండవ సమావేశము యొక్క ప్రధాన కార్యమంతా సమాఖ్య స్వరూపం మరియు అల్పసంఖ్యాక వర్గాల పై నియమించిన రెండు కమిటీలు నిర్వర్తించాయి. మహాత్మా గాంధీ ఈ రెండు కమిటీలలో సభ్యుడు. మూడవ రౌండు టేబులు సమావేశం నవంబర్ 17, 1932న ప్రారంభమైంది. ఇది చిన్నది మరియు అంత ప్రధానమైనది కాదు.కాంగ్రేసు నాయకులుగానీ ఇతర ప్రధాన రాజకీయనాయకులెవ్వరూ హాజరుకాలేదు.

1931 సెప్టెంబరు నుండి 1933 మార్చి వరకు రౌండు టేబులు సమావేశాల యొక్క సిఫారుసులను, ప్రతిపాదించిన సంస్కరణలను పొందుపరచి 1933 మార్చిలో ఒక శ్వేత పత్రమును విడుదల చేశారు. ఆ తరువాత నేరుగా దీనిపై బ్రిటీషు పార్లమెంటులో చర్చ జరిగినది. పార్లమెంటు సంయుక్త కమిటీ విశ్లేషించి ఆమోదము తెలియజేసిన తర్వాత ఆ బిల్లు 1935 జూలై 24న 1935 భారతదేశ ప్రభుత్వ చట్టంగా రూపొందినది.. ...పూర్తివ్యాసం: పాతవి